Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పవన్ హీరోయిన్ కి ప్రభుదేవా ప్రశంసలు
ముంబై: ప్రభుదేవా ప్రస్తుతం గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ని ప్రశంసలులో ముంచే పనిలో ఉన్నాడు. దానికి కారణం ఆమె తన తాజా చిత్రం నువ్వు వస్తానంటే నేవద్దంటానా రీమేక్ లో చేస్తోంది. ఆమె గురించి మాట్లాడుతూ... శృతి ఈ సినిమాలో లుక్ గర్ల్ ఎట్ నెక్ట్స్ డోర్ లాగ ఉంది. ఆమె సల్వార్ కమీజ్ లు వంటి సింపుల్ డ్రస్ లనే సినిమా మొత్తం ధరిస్తుంది. అంతేగాక రీటేక్స్ లేకుండా తన సీన్స్ ని తడబడకుండా పాస్ట్ గా చేసేస్తోంది అంటూ ప్రభుదేవా ముంబై మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.
ఇక శృతిహాసన్ తన దర్శకుడు ప్రభుదేవా గురించి మాట్లాడుతూ... ఆయన చాలా క్లియర్ గా తన వర్క్ విషయంలో ఉంటారు. ఆయనతో పనిచేస్తున్నప్పుడు మన దృష్టి కేవలం మన ఫెరఫార్మెన్స్ పై పెడితే చాలు. మిగతా విషయానలు గురించి వర్రీ కావాల్సిన పని లేదు. చాలా ఈజీగా మిగతా ప్రోసెస్ పూర్తి చేసారు అందామె. అలాగే తను ఈ సినిమాలో చేయటం తన అదృష్టమంటూ చెప్పుకొచ్చింది.
'రౌడీరాథోడ్'తో హిట్ కొట్టిన ప్రభుదేవా తాజాగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'చిత్రం హిందీలోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో త్రిష చేసిన పాత్రకు గానూ శృతి హాసన్ ని ఎంపిక చేసారు. ఈ విషయమై ప్రభుదేవా మాట్లాడుతూ...మేము ఈ చిత్రం కోసం కొత్త అమ్మాయిని అనుకున్నాము. అయితే శృతి హాసన్ బెస్ట్ ఛాయిస్ అనిపించింది అని చెప్పారు. ప్రస్తుతం ప్రభుదేవా ముంబైకి మకాం మార్చారు. బోనీకపూర్ ఖాళీ చేసిన వారి ఇంట్లో ఉంటున్నాడు.
ప్రభుదేవా వరసగా హిందీలో రీమేక్ లు చేసుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొన్న విక్రమార్కుడు రీమేక్ గా 'రౌడీరాథోడ్'రూపొందించి సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు అతని దృష్టి తెలుగులో ఘన విజయం సాధించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'పై పడింది. త్రిష,సిద్దార్ద కాంబినేషన్ లో ఎమ్.ఎస్ రాజు నిర్మాతగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇక్కడ ఘన విజయం సాధించింది. దాంతో హిందీలోనూ ఈ సినిమా వర్కవుట్ అవుతుందని భావించి చేస్తున్నారు.హిందీ రీమేక్కి కుమార్ తరౌనీ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ సినిమాతో ఆయన కుమారుడు గిరీష్ కథానాయకుడిగా పరిచయం కాబోతున్నారు.