Don't Miss!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- News ఏపీలో ఇప్పటివరకు భారీగా పట్టుబడిన నగదు, మద్యం, బంగారం.. అత్యధికంగా ఎక్కడంటే
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభుదేవా కొత్త అవతారం, ఇదిగో ఇదే... (ఫోటో)
హైదరాబాద్: ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా.... ఆ తర్వాత నటుడిగా, ఆపై దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుదేవా మరో కొత్త అవతారం ఎత్తారు. నిర్మాతగా మారారు. సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన ప్రొడక్షన్ హౌస్కు సంబంధించిన లోగోను విడుదల చేసారు.
‘ప్రభుదేవా స్టూడియోస్' పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్థాపిస్తున్నట్లు ప్రభుదేవా వెల్లడించారు. తమ బేనర్లో హై క్వాలిటీ, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించబోతున్నట్లు ప్రభుదేవా తెలిపారు. తమ బేనర్లో క్రియేటివ్ టాలెంట్ ఉన్న వారికి తమ బేనర్ ఒక మంచి ఫ్లాట్ ఫాంలా ఉంటుందని తెలపారు.
తమ బేనర్లో నిర్మించబోయే తొలి సినిమా గురించి ఆగస్టు 3న ప్రకటన చేస్తామని ప్రభుదేవా తెలిపారు. దేశ వ్యాప్తంగా టాలెంట్ ఉన్న వారిని గుర్తించి తమ బేనర్ ద్వారా అవకాశాలు కల్పిస్తామని, ఇప్పటి జనరేషన్లో దాగి ఉన్న టాలెంట్ వెలికి తీసేందుకు పలువురు ప్రముఖుల సహాయం తీసుకుంటానని ప్రభుదేవా తెలిపారు.
ప్రస్తుతం ప్రభుదేవా అక్షయ్ కుమార్ హీరోగా ‘సింగ్ ఈజ్ బ్లింగ్' అనే చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్, దల్జీత్ దోసంజ్, అమీ జాక్సన్, లారా దత్తా, అర్పి లాంబ, వివేక్ ఒబెరాయ్, బిపాసా బసు తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని యార్డి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.