Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అవకాసమొస్తే మహేష్ ని వదలనంటోంది
ముంబై: 'రాక్ ఆన్', 'వన్స్ ఒపన్ ఎ టైమ్ ఇన్ ఇండియా' వంటి చిత్రాలతో పాపులర్ అయిన బాలీవుడ్ బ్యూటీ ప్రాచీ దేశాయి అవకాసమొస్తే ప్రిన్స్ మహేష్ ని వదలనంటోంది. ఈ విషయం మీడియా వద్ద ప్రస్దావిస్తూ.. తాను రీసెంట్ గా ఈ హ్యాడసమ్ హీరో చేసిన ధమ్స్ అప్ యాడ్ చూసానని, తెగ నచ్చేసాడని, ఆ యాడ్ వస్తున్నప్పుడు టీవికి అతుక్కుపోతున్నానని చెప్తోంది. అలాగే అతని ప్రక్కన ఆఫర్ కనుక వస్తే ఎట్టి పరిస్దితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదు అంటోంది. ఇంతకీ మహేష్ ఈ మాటలు విని ఆమెకు ఆఫర్ ఇస్తాడో ఏంటో ఆమె ఆశ.
ప్రస్తుతం మహేష్. హీరోగా 14రీల్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుకుమార్ దర్శకుడు. ఈ చిత్రాన్ని మహేష్ జన్మదినం సందర్భంగా ఆగస్టు 9న విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం మంచి విజయం సాధించటంతో ఈ సినిమాకు బిజినెస్ సైతం ఓ రేంజిలో జరుగుతోందని టాక్. ఈ చిత్రం అనంతరం క్రిష్ దర్శకత్వంలో శివమ్ చిత్రం చేస్తారు. పీరియడ్ చిత్రంగా ఆ సినిమా తెరకెక్కనుంది. సోనాక్షి సిన్హా.. మహేష్ సరసన చేయటానికి కమిటైనట్లు సమాచారం.
అలాగే... ఈ చిత్రంతో పాటు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఆగడు చిత్రం రూపొందనుంది. దూకుడుతో ఈ కాంబినేషన్ తెలుగు పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో శ్రీనువైట్ల బాద్షా అనంతరం ఈ చిత్రాన్ని తెరకెక్కింటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మరో ప్రక్క పూరీ జగన్నాధ్ సైతం తన ఇద్దరమ్మాయిలుతో చిత్రం అనంతరం మహేష్ తో ఓ చిత్రం చేయనున్నారు.