Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
షూటింగ్లకు కేంద్రం అనుమతి.. వారు మాస్క్లు ధరించకపోయినా పర్లేదు!!
దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. అయితే ఓ వైపు కరోనా తాండవం చేస్తోంటో మరో వైపు అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. వివిద దశలో వివద రంగాలకు మినహాయింపులు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సినిమా, టెలివిజన్ రంగాలకు షూటింగ్లను చేసుకునే అనుమతిని ఇచ్చారు. అయితే ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు ఇప్పటికే వీటికి అనుమతిని మంజూరు చేయగా కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది.
అసలే టీవీ, సినీ ఇండస్ట్రీల్లో కరోనా తాండవం చేస్తోంది. ఇప్పటికే పలు ఇండస్ట్రీల్లోని సినీ పెద్దలందరూ కరోనా బారినపడ్డారు. అందుకే భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించేందకు నిర్మాతలు అలోచిస్తున్నారు. సెట్లో అడుగుపెట్టడానికి హీరో, హీరోయిన్లు కూడా భయపడుతున్నారు. కానీ కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాలు సినీ రంగంలో ఆశలు నింపేలా ఉంది. నిన్న సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది.
షూటింగ్ సమయంలో నటీనటులు మాస్క్లు ధరించకపోయినా పర్లేదు అని తెలిపింది. అయితే అదే సమయంలో ఇతర సాంకేతిక నిపుణులు, సెట్ వర్కర్స్ మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పీపీఈ కిట్స్ ధరించాలని, ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. సెట్లో కచ్చితంగా హెల్త్ ప్రోటోకాల్ పాటించాలని హెచ్చరించింది. ఇక ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాలతోనైనా హీరో హీరోయిన్లు ముందుకు వస్తారో లేదో చూడాలి.