Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
షూటింగ్లకు కేంద్రం అనుమతి.. వారు మాస్క్లు ధరించకపోయినా పర్లేదు!!
దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. అయితే ఓ వైపు కరోనా తాండవం చేస్తోంటో మరో వైపు అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. వివిద దశలో వివద రంగాలకు మినహాయింపులు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సినిమా, టెలివిజన్ రంగాలకు షూటింగ్లను చేసుకునే అనుమతిని ఇచ్చారు. అయితే ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు ఇప్పటికే వీటికి అనుమతిని మంజూరు చేయగా కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది.
అసలే టీవీ, సినీ ఇండస్ట్రీల్లో కరోనా తాండవం చేస్తోంది. ఇప్పటికే పలు ఇండస్ట్రీల్లోని సినీ పెద్దలందరూ కరోనా బారినపడ్డారు. అందుకే భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించేందకు నిర్మాతలు అలోచిస్తున్నారు. సెట్లో అడుగుపెట్టడానికి హీరో, హీరోయిన్లు కూడా భయపడుతున్నారు. కానీ కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాలు సినీ రంగంలో ఆశలు నింపేలా ఉంది. నిన్న సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది.
షూటింగ్ సమయంలో నటీనటులు మాస్క్లు ధరించకపోయినా పర్లేదు అని తెలిపింది. అయితే అదే సమయంలో ఇతర సాంకేతిక నిపుణులు, సెట్ వర్కర్స్ మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పీపీఈ కిట్స్ ధరించాలని, ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. సెట్లో కచ్చితంగా హెల్త్ ప్రోటోకాల్ పాటించాలని హెచ్చరించింది. ఇక ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాలతోనైనా హీరో హీరోయిన్లు ముందుకు వస్తారో లేదో చూడాలి.