Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పవన్ సత్యాగ్రహికి అమితాబ్ ట్విస్టు
పవన్ కళ్యాణ్ కలల ప్రాజెక్టు సత్యాగ్రహి. తను ఎంతో ఇష్టపడి ప్రారంభించినటువంటి ఈ చిత్రం టైటిల్ తో హిందిలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందనుంది.ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయటానికి సిద్దం అవుతున్నారు.అన్నాహజారే పోరాటం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది.అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే జరుపుతున్న పోరాటం,అందుకు ప్రభుత్వం నుండి ఎదురవుతున్న వ్యతిరేకత ఇందులో ప్రధానపాత్ర వహించనున్నాయి.ఇక ఈ చిత్రం గురించి ప్రకాష్ ఝా మాట్లాడుతూ..ఇప్పటికి ఈ చిత్రం కోసం అమితాబ్ మాత్రం ఎంపిక చేసాం.స్క్రిప్టు వర్క్ జరుగుతోంది.ప్రశాంతంగా జరిగే పోరాటం ఇందులో ప్రధానాంశం.అలాగే ఈ చిత్రం జనవరిలో షూటింగ్ మొదలవుతుంది అన్నారు.
ఇక పవన్ సత్యాగ్రహి చిత్రం విషయానికి వస్తే... అప్పట్లో ఈ చిత్రాన్ని బంగారం నిర్మించిన నిర్మాతలు చేత ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు.ఆ తర్వాత సీన్ లోకి సూర్య పేపర్ అధినేత నూకారపు సూర్య ప్రకాశరావు వచ్చారు.కానీ తర్వాత ఆ ప్రపోజల్ ఆగిపోయింది.తన కిష్టమైన చేగువేరా సిద్ధాంతాలను బలపరచటం,కామన్ ఫ్రొటక్షన్ ఫోర్స్ కి సంభందించిన వివరాలను విశదీకరించి అదో ఉద్యమంలా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనలు ఈ చిత్రంలో చోటు చేసుకోనున్నాయని అప్పట్లో అన్నారు.అలాగే తన దర్శకత్వంలో రానున్న చిత్రం కావటం తో కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా వాస్తవికతకు పెద్ద పీట వేయాలని అనుకున్నారు.అయితే ఇప్పుడు అదే టైటిల్ తో ఓ చిత్రం రూపొందనుందటం పవన్ కి ఊహించని ట్విస్టే.