Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పిల్లలను బలిచేస్తారా? సిగ్గులేదా మీకు.. మీరు ఉగ్రవాదులే.. ప్రకాశ్ రాజ్, ఫర్హాన్ ఫైర్
పద్మావతి చిత్ర విడుదలను అడ్డుకోవడానికి నిరసనకారులు ఢిల్లీకి సమీపంలో ఓ స్కూల్ బస్సుపై దాడి చేయడంపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా మండిపడ్డారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన పౌరులు ఇలాంటి దాడులకు పాల్పడటం సబబా అని ట్విట్టర్లో ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే...
Recommended Video
స్కూల్ బస్సులపై దాడి
పద్మావత్ చిత్ర రిలీజ్ నేపథ్యంలో ఢిల్లీలోని గురుగ్రామ్లో నిరసనకారులు తీవ్రంగా స్పందించారు. బుధవారం రెండు స్కూల్ బస్సులను టార్గెట్గా చేసుకొని దాడులు చేశారు. ఈ ఘటనలో స్కూల్ పిల్లలు వెంట్రుక వాసి భారీ ప్రమాదం నుంచి తప్పించుకొన్నారు. ఈ ఘటనపై ప్రకాశ్ రాజ్, ఫర్హాన్ అఖ్తర్, హన్సల్ మెహతా స్పందించారు.
|
పిల్లల్ని బలి చేస్తారా?
ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం స్కూల్ పిల్లలను బలిచేస్తారా? పిల్లల భద్రతను పట్టించుకోకుండా అలా దాడులు చేయడానికి సిగ్గులేదా అని అధికార, ప్రతిపక్ష పార్టీలపై ప్రకాష్ రాజ్ మండిపడ్డారు.
|
కర్ణిసేన దాడులతో
కర్ణిసేన దాడులతో దేశపు భావి భారతపౌరులు భీతిల్లిపోయారు. భయంతో ఏడుస్తూ చిగురుటాకులా వణికిపోయారు. కేంద్ర ప్రభుత్వం దీనిని పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష పార్టీలు కర్ర విరుగని రీతిలో డిప్లోమాటిక్గా వ్యవహరిస్తున్నాయి. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం పిల్లల ప్రాణాలు పణంగా పెడుతారా అని ప్రకాష్ రాజ్ ట్వీట్లో పేర్కొన్నారు.
|
వారు ఉగ్రవాదులే
స్కూల్ బస్సుపై దాడి చేయడం ఆందోళన అనిపించుకోదు. అది ఉగ్రవాదం అనిపిస్తున్నది. పిల్లలపై దాడి చేసిన వారు నా దృష్టిలో ఉగ్రవాదుల్లాంటి వారు. మీరు కూడా వారిని అలానే పిలువండి అని నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
దాడులు సరైనవి కావు
ఓ పక్క సినిమా ఓ వంశ ఔనత్యాన్ని చాటుతున్నది. మరోపక్క సినిమా నిర్వాహకులు రాజపుత్రుల వీరత్వం, ప్రతిష్ఠ గురించి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజపుత్రుల అనుకునేవారు పిల్లలపై దాడి చేస్తున్నారు. ఇది సరైనాదేనా అని హన్సల్ మెహతా నిలదీశారు.
సమాచారం లేకుండా దాడులు
పద్మావతి రిలీజ్ నేపథ్యంలో కర్ణిసేన కార్యకర్తలుగా భావిస్తున్న నిరసనకారులు దాడి చేసే సమయంలో టీచర్లు, బస్సు డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకొన్నారు. దాడి చేస్తుండగా బస్సు ఫ్లోర్ మీద పడుకోవాలని సూచించడంతో పిల్లలకు హానీ జరుగలేదు. బస్సు అద్దాలు మాత్రమే పగిలిపోయాయి అని బాధితులు చెప్పారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నిరసనకారులు దాడి చేయడం చాలా దారుణం అని బాధితుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.