Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ నిర్మాతలు మాఫియా: ప్రకాష్ రాజ్ సంచనల వ్యాఖ్య
అయితే తన సొంత గడ్డ కర్నాటక(కన్నడ చిత్రసీమ)లో మాత్రం ఆయన ఈ డబ్బింగ్ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కన్నడలో డబ్బింగ్ సంస్కృతిని విస్తరింప చేయాలని చూస్తున్న కొందరి ప్రయత్నాలను ఆయన ఎండగట్టారు. డబ్బింగ్ సంస్కృతి కన్నడ చిత్రసీమలో ప్రవేశించడం ద్వారా ఇక్కడి కళాకారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ప్రకాష్ రాజ్ హెచ్చరించారు.
మైసూరులో జరిగిన పబ్లిక్ ఈవెంటులో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ....డబ్బింగ్ అనేది ఒక భూతం లాంటిది. ఇప్పటికే చాలా చిత్రసీమల్లో ఈ భూతం విస్తరించింది. కొంత మంది నిర్మాతలు ఒక మాఫియాగా ఏర్పడి ఈ డబ్బింగ్ దందా నిర్వహిస్తున్నారు. కన్నడ చిత్ర సీమలో ఇప్పటి వరకు డబ్బింగ్ సంస్కృతి లేదని ఎంతో సంతోషంగా ఉండేవాన్ని. కన్నడ సినీ దిగ్గటజం డాక్టర్ రాజ్ కుమార్ ముందు చూపుతో డబ్బింగ్ సినిమాల మాఫియాను ఇటు వైపు రాకుండా చేసారు.
కానీ ఇపుడు కొందరు ఆయన ఆశయాలను తుంగలో తొక్కి...కన్నడ చిత్ర సీమలో డబ్బింగ్ సినిమాల జోరు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కన్నడ చిత్రసీమకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. రాజ్ కుమార్ గారు బ్రతికి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. డబ్బింగ్ సినిమాల రాకతో ఇక్కడ సినిమాలకు ఆదరణ తగ్గే అవకాశం ఉంది. ఇక్కడి కళాకారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.