ప్రకాష్ రాజ్ ‘ఉలవచారు బిర్యానీ' లేటెస్ట్ ఇన్ఫో
హైదరాబాద్ :విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్ త్వరలో 'ఉలవచారు బిర్యానీ' అనే చిత్రంతో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తన స్వీయదర్శకత్వంలో ధోనీ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రకాష్ రాజ్ మలయాళంలో ఘన విజయం సాధించిన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమాను తెలుగు తమిళ మరియు కన్నడ భాషలలో తెరకెక్కిస్తున్నాడు. మొదటి షెడ్యూల్ పూర్తైంది.
ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ 26న మైసూరులో మొదలై విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఎస్.పి బాలసుబ్రమణ్యం, స్నేహ మరియు ఊర్వశి ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాక 'ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్' నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆ మధ్య కేరళ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు వెళ్లిన ఆయన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రం చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. దాంతో వెంటన ఆ చిత్ర నిర్మాతను అప్రోచ్ కావటం రీమేక్ హక్కులను సొంతం చేసుకోవటం జరిగింది. మళయాలంలో ఈ చిత్రానికి ఆషిక్ అబు దర్శకుడు. ఇప్పుడు ఆ చిత్రాన్ని 'ఉలవచారు బిర్యానీ' పేరుతో తెలుగులో రూపొందించబోతున్నారు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించటంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...'ఉలవచారు బిర్యానీ' నేను నా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించబోతున్నాను. మళయాలంలో హిట్టయిన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెలుతుంది' అని తెలిపారు. మళయాళంలో వచ్చిన 'సాల్ట్ అండ్ పెప్పర్'లో మోహన్ లాల్, శ్వేతా మీనన్, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. మరో ముఖ్యపాత్రలో యామీ గౌతం నటించనుంది. హీరోగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్న ఈ "ఉలవచారు బిర్యానీ" కి ' లవ్ ఈజ్ కుకింగ్ ' అన్న ట్యాగ్ లైన్ తగిలించారు.


Click it and Unblock the Notifications











