Don't Miss!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిరంజీవి, జూ ఎన్టీఆర్, మహేష్ బాబులపై సంచలన వ్యాఖ్యలు..
చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులను చూస్తుంటే నాకు విపరీతమైన కోపం వస్తుందోంటూ ప్రకాష్ రాజ్ సంచలన వ్యాక్యలు చేశారు. బుదవారం ఆయన ఓ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, చిరంజీవి హీరోయింజం మార్క్ చిత్రాలకు బాటలు వేస్తే...అందులో జూ ఎన్టీఆర్, మహేష్ బాబులు కూడా కొనసాగిస్తూ..ఆ ట్రెండ్ నుండి బైట పడలేక పోతున్నారని అన్నారు. విభిన్న పాత్రలు, కథాంశాలు చేయాల్సిన వయసున్నా ఆ దిశగా ఆలోచించక పోవటం శోచనీయమన్నారు.
తక్కువ సినిమాలు చేసినా అల్లూ అర్జున్, ప్రభాస్ లు నటులుగా నిరూపించుకుంటున్నారని వ్యాఖ్యలు చేస్తూ ..భారత దేశంలో అత్యధిక సార్లు బ్యాన్ విధించబడిన నటుడిగానూ నాకు గుర్తింపుందని తన మీద తానే సూటైర్లేసుకున్నారు. జపాన్, స్వీడన్, చిత్రాల నటించే అవకాశాలు వస్తున్నాయని చెప్తూ..తనకి నచ్చిన నటులలో కోటా శ్రీనివాసరావుకే అగ్రతాంబూలమని...ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల నటుడాయనని వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్.