Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
కావేరీ వివాదం: ప్రకాశ్ రాజ్ లా తమిళ హీరోలు ఆలోచించరా..??
కావేరీ జలాలపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కావేరీ పరీవాహక ప్రాంతాల్లోని రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడుకు 10 రోజుల్లో 13 టీఎంసీల కావేరి జలాల్ని విడుదల చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో కర్ణాటకలో ఉద్రిక్తత నెలకొంది. మైసూరు, హాసన్, బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.
ఈ ప్రాంతాల్లో పలు ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. అనేక చోట్ల బంద్ వాతావరణం నెలకొంది. మండ్య జిల్లాలో లోక్సభ మాజీ సభ్యురాలు సినీ నటి రమ్య, విధానసభ సభ్యుడు, నటుడు అంబరీష్ దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సాగు నీటి మంత్రి పాటిల్ నివాసాల ఎదుట ఆందోళనకారులు నిరసన ప్రదర్శనల్ని నిర్వహించారు.
అయితే ఈ విషయంలో తమ రాష్ట్ర ప్రభుత్వానికి తాము కూడా అండగా ఉంటామని ప్రకటిస్తున్నారు తమిళసినీ జనాలు.కావేరి నదీ జలాల హక్కుల పరిరక్షణ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి - అమ్మ జయలలిత తీసుకునే చర్యలకు తాము పూర్తి అండగా ఉంటామని దక్షిణ భారత సినీ నటుల సంఘం ప్రకటించింది. తమిళ హీరో విశాల్.. తమిళ ప్రజల దాహార్తి తీర్చడానికి - రైతులకు వ్యవసాయానికి నీరు అందించడానికి అమ్మ జయలలిత తీవ్రంగా కృషి చేస్తున్నారని ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించారని
ఒక్కసారి సుప్రీం స్పష్టమైన తీర్పును ఇచ్చిన తర్వాత కూడా కర్ణాటకకు చెందిన వారు ఆందోళనకు దిగడం సరైన చర్య కాదనీ చెప్తూ ఈ వ్యవహారంలో కన్నడ నటుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపాడు. ఏది ఏమైనా.. కావేరి జలాల విషయంలో అమ్మ జయలలిత ఎలాంటి చర్యలు తీసుకున్నా.. తాము పూర్తిగా అండగా ఉంటామని ప్రకటించారు.
కానీ కన్నడ కర్ణాటక వాడే అయినా దక్షిణాది భాషలన్నిటిలోనూ పాపులర్ అయిన ప్రకాశ్ రాజ్ మాత్రం హుందాగా స్పందించాడు. ఎవరినీ నిందించలేదు, ఏ రాజకీయ కోణం నుంచీ స్పందించలేదు ''కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగుతున్నది చూస్తుంటే భాధగా ఉంది. మన హక్కుల కోసం మనం పోరాడాలి, న్యాయం సాదించాలి. కానీ అది బస్సులను తగలబెట్టి, అన్నదమ్ములను కొట్టి కాదు.
ఉద్యమం ఎలా చేయాలో మన భవిష్యత్ తరాలకు మనమే నేర్పించాలి. మనకు కోర్టులున్నాయి. నాయకులున్నారు. చట్టముంది. మనమంతా మనుషులం. శాంతిగా పోరాడుదాం. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ మనల్ని మనం నాశనం చేసుకోకూడదు. శాంతిగా ఉండండి. విధ్వసం ఆపండి'' అంటూ పిలుపునిచ్చారు ప్రకాష్ రాజ్