Don't Miss!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సెక్సీ టబుతో ప్రకాష్ రాజ్ ‘ఉలవచారు బిర్యానీ’!
తన స్వీయదర్శకత్వంలో ధోనీ చిత్రాన్ని తెరకెక్కించిన నటుడు ప్రకాష్ రాజ్ త్వరలో మరో సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్షుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం పేరు 'ఉలవచారు బిర్యానీ', మలయాళంలో ఘన విజయం సాధించిన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రానికి ఇది రీమేక్.
ఆ మధ్య కేరళ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు వెళ్లిన ఆయన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రం చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. దాంతో వెంటన ఆ చిత్ర నిర్మాతను అప్రోచ్ కావటం రీమేక్ హక్కులను సొంతం చేసుకోవటం జరిగింది. మళయాలంలో ఈ చిత్రానికి ఆషిక్ అబు దర్శకుడు. ఇప్పుడు ఆ చిత్రాన్ని 'ఉలవచారు బిర్యానీ' పేరుతో తెలుగులో రూపొందించబోతున్నారు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించటంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రం గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...'ఉలవచారు బిర్యానీ' నేను నా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించబోతున్నాను. మళయాలంలో హిట్టయిన 'సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రానికి ఇది రీమేక్. ఇందులో టబు కూడా నటిస్తోంది. ఈ చిత్రం 2013 ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెలుతుంది' అని తెలిపారు.
మళయాళంలో వచ్చిన 'సాల్ట్ అండ్ పెప్పర్'లో మోహన్ లాల్, శ్వేతా మీనన్, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. 'ఉలవచారు బిర్యానీ'లో సెక్సీ హీరోయిన్ టబుతో ప్రకాష్ రాజ్ రొమాన్స్ చేయనున్నాడట. మరో ముఖ్యపాత్రలో యామీ గౌతం నటించనుంది. హీరోగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్న ఈ "ఉలవచారు బిర్యానీ" కి ' లవ్ ఈజ్ కుకింగ్ ' అన్న ట్యాగ్ లైన్ తగిలించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ చిత్రానికి సాహిత్యం సిరివెన్నెల అందించనుండగా సంగీత బాధ్యతలు ఇళయరాజా స్వీకరించారట.