Don't Miss!
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
అల్లు శిరీష్ 'గౌరవం' గురించి ప్రకాష్ రాజ్ ట్వీట్
హైదరాబాద్ : తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ప్రకాష్ రాజ్ తాజా చిత్రం 'గౌరవం' తమిళ వెర్షన్కు సిబిఎఫ్సి 'యు' సర్టిఫికెట్ను అందించింది. తెలుగు వెర్షన్కి ఇంకా ఇంకా సెన్సార్ పత్రం రావలసి ఉంది. ఇదే విషయాన్ని ప్రకాష్ రాజ్ కూడా తన ట్విటర్ అకౌంట్లో తెలియజేశారు. గౌరవం తమిళ వెర్షన్కి క్లీన్ 'యు' సర్టిఫికెట్ వచ్చిందని, తెలుగు వెర్షన్ సెన్సార్ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.
అలాగే.. 'గగనం, ఆకాశమంత వంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలకు దర్శకత్వ వహించిన రాధామోహన్ దర్శకత్వంలో అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం గౌరవం. విక్కీ డోనర్ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన యామీ గౌతమ్ అల్లు శిరీష్తో జోడీ కట్టింది. ఈ సినిమా సామాజిక స్పృహ కలిగిన మంచి కథాంశంతో రూపొందుతోంది. దర్శకుడు రాధా మోహన్ తను చెప్పాలనుకున్న పాయింట్ ను తెరమీద అద్భుతంగా ఆవిష్కరించారని' తెలిపారు.
దర్శకుడు రాధామోహన్ మాట్లాడుతూ...ఒక మంచి కథకి, మంచి నటీనటులు సమకూరితే ఆ చిత్రం ఎలా ఉంటుందో మా గౌరవం కూడా అదే రేంజిలో ఉండబోతోంది. ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే హైలెట్గా నిలవబోతోంది. మేము ఎంచుకున్న కాన్సెప్ట్ గౌరవం చిత్రానికి బాగా ప్లస్సవుతుంది. అల్లు శిరీష్, యామి గౌతమ్, ప్రకాష్ రాజ్, నాజర్ వారి పాత్రల్లో ఇమిడిపోయారు. తమన్ సంగీతం వైవిద్యంగా ఉండబోతోంది. సినిమాటోగ్రఫీ మరో హైలెట్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.
రాధామోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ పరిచయమవుతుండగా, యామి గౌతమ్, రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. డ్యూయెట్ మూవీస్ పతాకంపై రాజ్ నిర్మించే ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ బాణీలు అందించారు.