Don't Miss!
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
పవన్-త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఈవిడే
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ గా ఎంపికవగా....సెకండ్ హీరోయిన్ కోసం వెతుకులాట సాగుతున్న సంగతి తెలసిందే. సెకండ్ హీరోయిన్గా కింగ్ ఫిషర్ మోడల్ కైరా దత్ ఎంపికయిందంటూ...వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ వట్టి పుకార్లే అని తాజాగా అందిన సమాచారం.
ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం హీరోయిన్ ప్రణీత ఈచిత్రంలో సెకండ్ హీరోయిన్గా ఎంపికయిందని తెలుస్తోంది. ప్రణీత ఇప్పటికే ఈ సినిమాకు సైన్ చేసిందట. 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత అనంతరం సిద్ధార్థ సరసన 'బావ' చిత్రంలో నటించింది. ఆ తర్వాత 'శకుని' అనే తమిళ డబ్బింగ్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు చిత్రం పవన్-త్రివిక్రమ్ చిత్రమే.
ఇప్పటికే పవన్, తివిక్రమ్ కలిసి విదేశాల్లో పర్యటించి సినిమాకు కావాల్సిన లొకేషన్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. జనవరి 8 నుంచి 'సరదా' రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేసారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈచిత్రం ప్రతి సీన్ వినోదాత్మకంగా, ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీ, పంచ్ డైలాగులు మేళవించిన తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు.