Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘డెక్కన్ చార్జర్స్’పై కన్నేసిన తెలుగు సినీ నిర్మాత
హైదరాబాద్ : కష్టాల్లో ఉన్న ఐపీఎల్ టీం డెక్కన్ చార్జర్స్ను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ జట్టును కొనుక్కునేందుకు చాలా మంది బడా బాబులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా అందిన ఆసక్తిర విషయం ఏమిటంటే ఈ జట్టును దక్కించుకునేందుకు తెలుగు సినీ నిర్మాత, పివిపి సినిమాస్ సంస్థ అధినేత ప్రసాద్ వి పొట్లూరి కూడా బిడ్ వేసారని తెలుస్తోంది.
విజయవాడకు చెందిన ప్రసాద్ వర పొట్లూరి బిజినెస్ మ్యాన్గా ఎదిగి ఆ తర్వాత సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. తన పేరుపైనే 'పివిపి సినిమాస్' అనే బేనర్ స్థాపించారు. పివిపి సినిమా బేనర్పై ఇప్పటి వరకు తమిళం, తెలుగులో పలు భారీ సినిమాలు నిర్మించారు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రాన్ని తమిళంలో 'నాన్ఈ' పేరుతో పివిపి సినిమా వారు ప్రొడ్యూస్ చేసారు.
రవితేజ, గోపీ చంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'బలుపు' . ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో డాన్ శ్రీను చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ వి పొట్లూరి పివిపి సినిమా బేనర్పై ఈ చిత్రాన్ని నిర్మించన్నారు. ఈచిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
సౌతిండియాలో లీడింగ్ ఫిల్మ్ ఫైన్సాయర్గా ప్రసాద్ వి పొట్లూరి కొనసాగుతున్నారు. తమిళంలో అనేక చిత్రాలకు ఆయన ఫైనాన్స్ చేసారు. మరి ఈ బడా నిర్మాత చేతికి డెక్కన్ చార్జర్స్ జట్టు దక్కుతుందో? లేదో? మరికొన్ని రోజుల్లో తేలనుంది.