Don't Miss!
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- News కూతురు ఎవరికైనా కూతురే, ఎన్నికల సమయంలో రాజకీయాలా, నీతులు చెబుతున్న లీడర్!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనాను మించిన వైరస్.. రేపు ప్రకటించనున్న ప్రశాంత్ వర్మ
అ!, కల్కి వంటి చిత్రాలతో ప్రశాంత్ వర్మ తన సత్తా చాటుకున్నాడు. కమర్షియల్ హంగుల జోలికి పోకుండా తాను నమ్మిన కథపైనా ఆధారపడి చిత్రాలను తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించాడు. మొదటి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. రెండో సినిమా కల్కిని తెరకెక్కించాడు. అది కమర్షియల్గా అంత వర్కౌట్ కాకపోయినా.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని మూటగట్టుకుంది.
కల్కి చిత్రం తరువాత ప్రశాంత్ తన మూడో ప్రాజెక్ట్ను ప్రారంభించేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. అ! సినిమాకు సీక్వెల్ చేసే ప్రయత్నంలో ఎంతో మంది నిర్మాతలను కూడా సంప్రదించాడట. కానీ ఎవ్వరూ ఓకే చేయలేదని, తన స్క్రిప్ట్కు సంబంధించిన పనులు గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ వర్మ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో అందరి ముందుకు వచ్చాడు.
కరోనా వ్యాక్సిన్ లోడింగ్ 10 శాతం అంటూ విడుదల చేసిన ప్రీ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ప్రశాంత్ వర్మ బర్త్ డే (మే 29)సందర్భంగారిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ వైరల్ అయింది. కర్నూలు కొండారెడ్డి బుర్జును చూపడం, కరోనా కేవలం ఆరంభం మాత్రమేనని పోస్టర్పైన చెప్పడం చివర్లో డైనోసర్ నోటిని చూపెట్టడం వంటి వాటితో అంచనాలు తారాస్థాయికి చేరుకుంది. అయితే తాజాగా మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ను రేపు (ఆగస్టు 8) ఉదయం 9 గంటలకు ప్రకటించబోతోన్నట్టు తెలిపారు.