Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనాను మించిన వైరస్.. రేపు ప్రకటించనున్న ప్రశాంత్ వర్మ
అ!, కల్కి వంటి చిత్రాలతో ప్రశాంత్ వర్మ తన సత్తా చాటుకున్నాడు. కమర్షియల్ హంగుల జోలికి పోకుండా తాను నమ్మిన కథపైనా ఆధారపడి చిత్రాలను తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించాడు. మొదటి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. రెండో సినిమా కల్కిని తెరకెక్కించాడు. అది కమర్షియల్గా అంత వర్కౌట్ కాకపోయినా.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని మూటగట్టుకుంది.
కల్కి చిత్రం తరువాత ప్రశాంత్ తన మూడో ప్రాజెక్ట్ను ప్రారంభించేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. అ! సినిమాకు సీక్వెల్ చేసే ప్రయత్నంలో ఎంతో మంది నిర్మాతలను కూడా సంప్రదించాడట. కానీ ఎవ్వరూ ఓకే చేయలేదని, తన స్క్రిప్ట్కు సంబంధించిన పనులు గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ వర్మ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో అందరి ముందుకు వచ్చాడు.
కరోనా వ్యాక్సిన్ లోడింగ్ 10 శాతం అంటూ విడుదల చేసిన ప్రీ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ప్రశాంత్ వర్మ బర్త్ డే (మే 29)సందర్భంగారిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ వైరల్ అయింది. కర్నూలు కొండారెడ్డి బుర్జును చూపడం, కరోనా కేవలం ఆరంభం మాత్రమేనని పోస్టర్పైన చెప్పడం చివర్లో డైనోసర్ నోటిని చూపెట్టడం వంటి వాటితో అంచనాలు తారాస్థాయికి చేరుకుంది. అయితే తాజాగా మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ను రేపు (ఆగస్టు 8) ఉదయం 9 గంటలకు ప్రకటించబోతోన్నట్టు తెలిపారు.