Don't Miss!
- News ఊపిిరి పీల్చుకున్న ఉద్యాననగరి
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ప్రకాష్ రాజ్ చేసిది ఆ పాత్ర కాదు.. ప్రశాంత్ నీల్ క్లారిటీ
కేజీయఫ్ చాఫ్టర్ 2 చిత్రీకరణ మొదలైంది. లాక్ డౌన్ తరువాత మొదలుపెట్టిన మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ మూవీగా కేజీయఫ్ రికార్డ్ సృష్టించింది. అయితే సెట్స్లో అడుగుపెట్టిన ప్రశాంత్ నీల్.. వర్కింగ్ స్టిల్స్ను షేర్ చేశారు. అందులో ప్రకాష్ రాజ్ అదిరిపోయే గెటప్లో కనిపించాడు. అయితే ఆ లుక్ను చూస్తే అందరికీ ఓ పాత్ర గుర్తుకు వచ్చింది.
కేజీయఫ్లో హీరో ఎలివేషన్స్ను చెప్పే సీనియర్ జర్నలిస్ట్ పాత్రను అనంత్ నాగ్ పోషించాడు. అయితే అనంత్ నాగ్ను సినిమా నుంచి తీసేశారని, ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే అనంత్ నాగ్ పాత్ర అంతగా హైలెట్ అయినా ఎందుకు తీసేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే ప్రకాష్ రాజ్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు.
ప్రకాష్ రాజ్ పాత్ర గురించి ప్రశాంత్ నీల్ చెబుతూ.. అనంత్ నాగ్ క్యారెక్టర్ను రీప్లేస్ చేయడం లేదని, కొత్త పాత్రను సృష్టించానని చెప్పుకొచ్చాడు. ఇది దాదాపు 25 రోజుల షెడ్యూల్ అని, ఫస్ట్ పది రోజుల్లో ప్రకాష్ రాజ్, మాళవిక అవినాష్, నాగభరణం వంటి వారు జాయిన్ అవుతారని తెలిపారు. ప్రస్తుతం ఇది కంఠీవర స్టూడియోలో జరుగుతోందని, ఈ షెడ్యూల్లో యష్ జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి పార్ట్ ఎంతగా సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా రాఖీ భాయ్ పాత్రతో యశ్ పాపులార్టీ దక్కింది.