Don't Miss!
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మా సినిమాని రామ్గోపాల్వర్మ మెచ్చుకున్నారు
హైదరాబాద్: ఈ సినిమా చూసి మా గురువు రామ్గోపాల్వర్మ మెచ్చుకున్నారు. చాలామంది బాలీవుడ్ నటులు కూడా సినిమా గురించి ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు అని చెప్పారు దర్శకుడు ప్రవీణ్ శ్రీ. ప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కాళిచరణ్'. శ్రీ కరుణాలయం ప్రొడక్షన్స్ పతాకంపై బేబీ మనస్విని సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతన్య కృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. చాందిని హీరోయిన్. గీతా ఆర్ట్స సంస్థ ద్వారా నవంబరు 8న సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగాల ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.
''సమాంతర చిత్రాలు, వాణిజ్య చిత్రాలూ అనే తేడా ఏమీ ఉండదు. ఎక్కువ మందికి చేరేదే వాణిజ్య చిత్రం. అందుకే నా సినిమాని అందరూ చూసేలా తీర్చిదిద్దా'' అంటున్నారు శ్రీప్రవీణ్. 'గాయం2'తో దర్శకుడిగా పరిచయం అయ్యారాయన. రామ్గోపాల్వర్మ శిష్యుడిగా ఆయన బాటలోనే వెళ్తూ వాస్తవాలకు అద్దం పట్టేలా 'కాళిచరణ్' చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాత కూడా ఆయనే
ఇక ''గుజరాత్లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. దినపత్రికల్లో ఎన్నో సంఘటనలకు మనల్ని కలచి వేస్తుంటాయి. అలాంటి ఘటన నా ఇంట్లో జరిగితే.. నేనెలా స్పందిస్తా అనేదే ఈ సినిమా. వాస్తవ సమాజాన్ని ప్రతిబింబించేలా తెరకెక్కించాం. 80వ దశకం నాటి వాతావరణం తెరపై కనిపిస్తుంది. దాని కోసం చాలా కష్టపడ్డాం. చైతన్య కృష్ణకు ఈ సినిమాతో మంచి పేరొస్తుందనే నమ్మకం ఉంది''అన్నారు.
''చాలా ఆటంకాలు ఎదుర్కొని ఈ సినిమా రూపొందించాం. సెన్సార్ వాళ్లూ అభ్యంతరం చెప్పారు. ఓ సంఘటనపై స్పందిచే హక్కు సినిమా వాళ్లకూ ఇవ్వాలి. ఏం జరిగింది? ఎలా జరిగింది? అనే విషయాలను కళ్లకు కట్టినట్టు చెప్పడం తప్పు కాదు కదా? కనీసం సమాజంలో ఒక్క శాతమైనా మార్పు తీసుకొచ్చేందుకు వీలుంటుంది. హాలీవుడ్ చిత్రం 'గాడ్ ఫాదర్' నాకు స్ఫూర్తి. అదో మాఫియా చిత్రంలా అనిపిస్తుంది. కానీ అందులో కుటుంబ బంధాల్ని అందంగా చూపించారు. వర్మ శిష్యులు సాంకేతిక అంశాలపై ఎక్కువ దృష్టి పెడతారు అనుకొంటారు. కానీ మేం కథను నమ్ముతాం. నేను నమ్మిన కథని సమర్థంగా తెరకెక్కించడమే ముఖ్యం'' అని చెప్పారు శ్రీప్రవీణ్.
''1980ల్లో గుజరాత్లోని పలన్పూర్లో జరిగిన ఓ యధార్థ సంఘటన స్ఫూర్తితో 'కాళీచరణ్' కథ తయారు చేసుకున్నా. తెలుగు నేటివిటీకి సౌలభ్యంగా ఉంటుందని మహబూబ్నగర్లోని పాలమూరు నేపథ్యాన్ని సినిమాలో చూపించాను. అంతేకానీ పాలమూరులో జరిగిన సంఘటనలు దీనికి స్ఫూర్తి కాదు'' అని శ్రీప్రవీణ్ చెప్పారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'కాళీచరణ్' ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.