Don't Miss!
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- News వైసీపీకి షాక్.. పార్టీకు గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- Technology 8GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా, 6.67 అంగుళాల డిస్ప్లేతో Realme స్మార్ట్ఫోన్ విడుదల..తొలిసారిగా ఈ ఫీచర్లతో!
- Sports రోహిత్ స్టార్ట్ చేశాడు.. ‘RIP హార్దిక్’ అంటూ పోస్ట్లు Video
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
మెగాభిమానుల చర్చ దీని గురించే,ఇప్పుడే ఇలా ఉంటే, ఇంక...
హైదరాబాద్: మొత్తానికి మెగా అభిమానులంతా ఇప్పుడు ఓ డిస్కషన్ లో మునిగిపోయారు. అదేమింటే...తమ ఆరాధ్యదైవం మెగా స్టార్ చిరంజీవి ప్రీ లుక్ వచ్చేసింది. ఫస్ట్ లుక్ ని 150వ సినిమా టైటిల్తో పాటే ఈనెల 22న విడుదల చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఫస్ట్ లుక్ ని ఏ విధంగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలి. ఏ స్దాయిలో దాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయమీదే దృష్టి పెడుతున్నారు. ఫస్ట్లుక్ చెప్పిన తేదీకే పక్కాగా వచ్చేస్తుందని తెలుపుతూ, చరణ్, నిన్న సాయంత్రం ఓ ప్రీ లుక్ను కూడా విడుదల చేయటం వారిని ఆనందంలో ముంచెత్తుతోంది.
అంతేకాకుండా.. చిరు పుట్టినరోజును భారీగా సెలబ్రేట్ చేస్తూ..,ఫస్ట్లుక్ విడుదలకు భారీ క్రేజ్ తెచ్చేలా రామ్ చరణ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. అందులో పాలు పంచుకుని తమ మెగాభిమానాన్ని అదిరిపోయే స్దాయిలో చాటాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెగా అభిమాన సంఘాలు సైతం ఎలర్ట్ గా ఉన్నాయి.
ఇక తమిళంలో ఘన విజయం సాధించిన 'కత్తి' సినిమాకు రీమేక్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా ప్రకటన వచ్చిన రోజునుంచే ఎక్సపెక్టేషన్స్ మొదలైపోయాయి.సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా రైతుల సమస్యలు, వారి భూములను కార్పోరేట్ సంస్థలు ఎలా చేజక్కించుకుంటున్నాయి? వాటిపై హీరో ఎలా పోరాడాడు అన్న అంశాలపై సినిమా నడుస్తూ ఉంటుంది.
దాదాపు 9 ఏళ్ళ తర్వాత చిరంజీవి చేస్తున్న ఫుల్ లెంగ్త్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆ మధ్యన మొదలైన ఈ చిత్ర షూటింగ్ తాజాగా చంచల్ గూడకి లో జరుపుకుంది. అక్కడ జైలులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
వివి వినాయక్ తన దైన స్టైల్లో చిత్రీకరించే సన్నివేశాలు ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్లో మేజర్ షెడ్యూల్ని చిత్రీకరించనున్నట్టు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన బాణీలను కూర్చే పనిలో బిజీ అయ్యాడు.