Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇపుడు కొడుకుతో....(ఫోటో)
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘తమ్ముడు' మూవీ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది బాలీవుడ్ బ్యూటీ ప్రీతి ఝంగియానీ. అయితే ఆ సినిమాలో మాత్రం ఆమె పేరును ప్రీతి జింగానియాగా వేసారు. మళయాలం మూవీ ‘మఝావిల్లు' హీరోయిన్ గా తెరంగ్రేటం చేసిన ప్రీతి... తమ్ముడు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
తమ్ముడు సినిమా తర్వాత బాలయ్యతో ‘నరసింహ నాయుడు', మెహన్ బాబుతో ‘అధిపతి', అప్పారావు డ్రైవింగ్ స్కూల్, ఆనందమానందమాయే, యమదొంగ సినిమాలో ఊర్విసిగా గెస్ట్ రోల్, విశాఖ ఎక్స్ ప్రెస్, తర్వాత ‘తేజం' అనే మరో సినిమాలో నటించింది. అయితే ‘తమ్ముడు' సినిమాకు వచ్చినంత గుర్తింపు ఆమెకు ఏ సినిమాకూ రాలేదని చెప్పొచ్చు.
సౌత్ సినిమాల కంటే బాలీవుడ్ సినిమాల్లోనే ప్రీతి ఎక్కువగా నటించింది. 2008లో పర్విన్ దబ్బాస్ను పెళ్లాడిన ఆమె తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. 2011లో ఏప్రిల్ 11న కొడుకు జన్మించాడు. ఆ తర్వాత కూడా 2013 వరకు వివిధ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె కొడుకు పెంపకంపైనే ఎక్కువ దృష్టి సారించింది. తాజాగా కొడుకుతో దిగిన ఫోటోను షేర్ చేసింది.