Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
లైంగికంగా వేదించిన బాయ్ ఫ్రెండ్ తోనే మళ్ళీ కనిపించింది: పెళ్ళయ్యాక కూడా
పంజాబ్ మ్యాచ్ ల సందర్భంగా స్టాండ్స్ లో నెస్ వాడియా, ప్రీతి జింతా ఇద్దరూ ముచ్చటించుకుంటూ కనిపించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించిన అనంతరం ఇద్దరూ తమ జట్టు
నెస్ వాడియా, ప్రీతి జింతా మధ్య ఉన్న సంబంధం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఇద్దరూ కలిసి గతంలో ఐపీఎల్ పంజాబ్ టీంకు ఓనర్లుగా ఉన్నారు. కొంత కాలం తర్వాత విడిపోయారు. అదీ మామూలుగా కాదు ఇద్దరి మధ్యా పెద్ద యుద్దమే జరిగింది. తనను వాడియా గదిలో బందించి కాలే సిగరెట్లను ముఖంపై వేసే వాడని , తనపై చేయి చేసుకొని హింసాత్మకంగా ప్రవర్తించే వాడని, వాడియా నుంచి తనను దూరంగా కోరుకుంటున్నానని, లేదంటే ఏదో ఒకరోజు వాడియా ఆగ్రహానికి తాను బలికావలసి వస్తుందని ఆరోపించింది ప్రీతీజింతా...
లైంగికంగా వేదించాడని
వాంఖడే స్టేడియంలో పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తనపై చేయి చేసుకున్నాడని, లైంగికంగా కూడా వేదించాడని ప్రీతి జింతా ఆరోపించింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు ప్రీతి సహ భాగస్వామి.
ప్రేమ వ్యవహారం
నెస్ వాడియా, ప్రీతి జింతాల మధ్య గతంలో నాలుగేళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిచింది. 2009లో వీరిద్దరూ విడిపోయారు. బాలీవుడ్ లోనే కాదు, ఐపీఎల్ విషయం కూడా కాబ్ట్తి ఈ ప్రేమ "యుద్దం" దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. నెస్ వాడియ కూడా తన తరపు వాదనలు వినిపించాడు మొత్తానికి ఆ కేసు ఏమయ్యిందో గానీ మళ్ళీ ఎక్కడా ఈ ఇద్దరి పేర్లూ కలిసి కనిపించలేదు.
జీని గుడెనఫ్ ని పెళ్ళి చేసుకొని
ఆతర్వాత కొంత కాలానికి తన ఫ్రెండ్ అయిన జీని గుడెనఫ్ ని పెళ్ళి చేసుకొని అమెరికా లోనే స్థిరపడింది ప్రీతీ. అయితే ఇప్పుడు సడెన్ గా అమ్మడి ఫ్లాష్ బ్యాక్ ఎందుకు పైకి వచ్చిందీ అంటే.... ఐపీఎల్ కొత్త సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ప్రీతి.. వాడియా సన్నిహితంగా కినిపిస్తున్నారు.
ఆశ్చర్యం కలిగించే విషయమే
పంజాబ్ మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్ లో ఇద్దరూ ముచ్చటించుకుంటూ కనిపించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించిన అనంతరం ఇద్దరూ తమ జట్టు ఆటగాళ్లతో కలసి సంబరాలు కూడా చేసుకున్నారు. తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన వ్యక్తితో మళ్లీ ఇలా ప్రీతి సన్నిహితంగా కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. హై ప్రొఫైల్ జీవితాల్లో ఏం జరిగినా అది సంచలనమే మరి...