Don't Miss!
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
‘ప్రేమకథా చిత్రమ్’50: కృష్ణ, మహేష్ హ్యాపీ
హైదరాబాద్ : ప్రేమకథా చిత్రమ్ భారీ విజయం సాధించడంతో కృష్ణ, హహేష్ బాబు చాలా హ్యాపీగా ఉన్నారని హీరో సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. సుధీర్ బాబు, నందిత హీరో హీరోయిన్లుగా జె. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో మారుతి మీడియా హౌస్ రూపొందించిన 'ప్రేమకథా చిత్రమ్' విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో ఫంక్షన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ... 'ప్రేమకథా చిత్రమ్ విజయవంతం కావడంతో నా బాధ్యత మరింత పెరిగింది. సినిమా విజయం పట్ల మామయ్య కృష్ణతో పాటు, మహేష్ బాబుకు కూడా ఆనందంగా ఉన్నారు. మహేష్ బాబు సినిమా విజయవంతం అయినప్పుడు కృష్ణగారు ఎంత సంతోషంగా ఫీలవుతారు ఇప్పుడు నా విషయంలోనే అదే విధంగా ఫీలవుతున్నారు. నాకు ఇంత పెద్ద విజయం అందించిన అందిరికీ కృతజ్ఞతలు' అని తెలిపారు.
మారుతి మాట్లాడుతూ...'సుధీర్ బాబు వల్లనే ఈ సినిమా తెరకెక్కింది. నేను రెండు కథలు చెబితే ఆయన దీన్నే ఒకే చేసారు. నందిత పెర్ఫార్మెన్స్ సినిమాకు కీలకంగా మారింది. ఆమె కోసమే పాత్ర నిడివి పెంచాను.ఇండియా మొత్తం మీద ఎక్కువ రేటుకు రీమేక్ హక్కులు పొందిన చిత్రమని చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నాను. ఈ చిత్రాన్ని తమిళం, మలయాళంలో కాశీ విశ్వనాథ్ రీమేక్ చేస్తున్నారు' అని తెలిపారు.
డార్లింగ్ స్వామి మాట్లాడుతూ....సినిమా ఇప్పటికే 66 రోజులు పూర్తయిందని, త్వరలో 100 రోజులు పూర్తి చేసుకోబోతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం, సి.కళ్యాణ్, లగడపాటి శ్రీధర్, ఎంఎస్ రాజు, స్వామి, సురేస్ కొండేటి, కాశీవిశ్వనాథ్ హాజయ్యారు.