twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందీ, తమిళంలో ‘ప్రేమకథా చిత్రమ్’ రీమేక్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సుధీర్‌బాబు, నందిత జంటగా మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో సుదర్శన్ రెడ్డి నిర్మించిన చిత్రం 'ప్రేమకథా చిత్రమ్'. జె. ప్రభాకర్‌రెడ్డి దర్శకుడు. నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం ఇప్పటికీ మంచి కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. తెలుగులో మంచి విజయం సాధించిన ఈచిత్రాన్ని హిందీ, తమిళంలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    ఈ చిత్రం హిందీ, తమిళం రైట్స్ మంచి రేటుకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. హిందీ రీమేక్ రైట్స్ ఆది శేషగిరిరావు, తమిళ రీమేక్ రైట్స్ తమిళ నిర్మాత కాశీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈచిత్రం కేవలం 2 కోట్ల రూపాయలతో నిర్మించారు. కానీ రెండు వారల్లోనే ఈచిత్రం రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసింది.

    కాగా...త్వరలో 'ప్రేమకథా చిత్రమ్' సీక్వెల్ కూడా రాబోతోంది. 'పెళ్లి కథా చిత్రమ్' పేరుతో ఈ సీక్వెల్ రాబోతున్నట్లు ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుదర్శన్ రెడ్డి తెలిపారు. మరో వైపు ఈచిత్రంతో సుధీర్ బాబుకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ఊపుతో ఆయన వరుస సినిమాలు సైన్ చేసాడు.

    త్వరలో సుధీర్ బాబు 'మాయదారి మల్లిగాడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'మాయదారి మల్లిగాడు' చిత్రం ద్వారా హనుమాన్ అనే కొత్త దర్శకుడు వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. రేవన్ కుమార్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 26న ఈ చిత్రం లాంభనంగా ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

    English summary
    "The remake rights have been bought for an exorbitant price. While the Hindi remake rights have been bought by Adi Seshagiri Rao, the Tamil remake rights have been purchased by Tamil producer Kasi," Sudharshan Reddy, producer of "Prema Katha Chitram" told IANS.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X