Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
భానుమతి పురస్కారంతో జమనకు సత్కారం
పద్మశ్రీ డాక్టర్ భానుమతి రామకృష్ణ 88వ జయంతిసందర్భంగా అలనాటి మేటి నటీమణి జమునకు 'భానమతి-వంశీ' పురస్కారాన్ని అందించారు. రవీంద్రభారతిలో మంగళవారం రాత్రి.. టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్, వంశీ ఇంటర్నేషనల్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.లభానుమతి, జమునల నటనా వైదుష్యాన్ని గురించి ఘనంగా ప్రస్తావించారు. ఇద్దరూ బహుముఖీన ప్రతిభతో పాటు ఆత్మవిశ్వాసంతో తాము నటించిన పాత్రలకు ప్రాణం పోశారని ప్రశంసించారు.
భానుమతితో తాను కొన్ని సినిమాల్లో నటించానని సినీ నటుడు మురళీమోహన్ అధ్యక్షోపన్యాసంలో తెలిపారు. జమున రాజకీయాల్లోకి వచ్చి రంగస్థల, సినీ కళాకారుల సంక్షేమం కోసం విశేష కృషి చేశారన్నారు.తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. వంశీ, గిఫ్ట్ సంస్థల వ్యవస్థాపకుడు వంశీ రామరాజు.. తమ సంస్థ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా.. పలువురు గాయనీగాయకులు భానుమతి నటించిన చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటల్ని ఆలపించి శ్రోతల్ని అలరింపజేశారు.