Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
భానుమతి పురస్కారంతో జమనకు సత్కారం
పద్మశ్రీ డాక్టర్ భానుమతి రామకృష్ణ 88వ జయంతిసందర్భంగా అలనాటి మేటి నటీమణి జమునకు 'భానమతి-వంశీ' పురస్కారాన్ని అందించారు. రవీంద్రభారతిలో మంగళవారం రాత్రి.. టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్, వంశీ ఇంటర్నేషనల్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.లభానుమతి, జమునల నటనా వైదుష్యాన్ని గురించి ఘనంగా ప్రస్తావించారు. ఇద్దరూ బహుముఖీన ప్రతిభతో పాటు ఆత్మవిశ్వాసంతో తాము నటించిన పాత్రలకు ప్రాణం పోశారని ప్రశంసించారు.
భానుమతితో తాను కొన్ని సినిమాల్లో నటించానని సినీ నటుడు మురళీమోహన్ అధ్యక్షోపన్యాసంలో తెలిపారు. జమున రాజకీయాల్లోకి వచ్చి రంగస్థల, సినీ కళాకారుల సంక్షేమం కోసం విశేష కృషి చేశారన్నారు.తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. వంశీ, గిఫ్ట్ సంస్థల వ్యవస్థాపకుడు వంశీ రామరాజు.. తమ సంస్థ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా.. పలువురు గాయనీగాయకులు భానుమతి నటించిన చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటల్ని ఆలపించి శ్రోతల్ని అలరింపజేశారు.