Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
భానుమతి పురస్కారంతో జమనకు సత్కారం
పద్మశ్రీ డాక్టర్ భానుమతి రామకృష్ణ 88వ జయంతిసందర్భంగా అలనాటి మేటి నటీమణి జమునకు 'భానమతి-వంశీ' పురస్కారాన్ని అందించారు. రవీంద్రభారతిలో మంగళవారం రాత్రి.. టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్, వంశీ ఇంటర్నేషనల్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.లభానుమతి, జమునల నటనా వైదుష్యాన్ని గురించి ఘనంగా ప్రస్తావించారు. ఇద్దరూ బహుముఖీన ప్రతిభతో పాటు ఆత్మవిశ్వాసంతో తాము నటించిన పాత్రలకు ప్రాణం పోశారని ప్రశంసించారు.
భానుమతితో తాను కొన్ని సినిమాల్లో నటించానని సినీ నటుడు మురళీమోహన్ అధ్యక్షోపన్యాసంలో తెలిపారు. జమున రాజకీయాల్లోకి వచ్చి రంగస్థల, సినీ కళాకారుల సంక్షేమం కోసం విశేష కృషి చేశారన్నారు.తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. వంశీ, గిఫ్ట్ సంస్థల వ్యవస్థాపకుడు వంశీ రామరాజు.. తమ సంస్థ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా.. పలువురు గాయనీగాయకులు భానుమతి నటించిన చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటల్ని ఆలపించి శ్రోతల్ని అలరింపజేశారు.