Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రిన్స్ మహేష్ బాబు టార్గెట్ ‘మగధీర’!?
'పోకిరి" సినిమా నలభై కోట్లు కలెక్ట్ చేసినప్పుడు అది టాలీవుడ్ రికార్డ్ నెలకొల్పింది. మూడేళ్ల పాటు వున్న ఆ రికార్డుని 'మగధీర" అనూహ్యమైన మార్జిన్ తో బీట్ చేసింది. సుమారు 'పోకిరి" వసూళ్లతో సమానమైన బడ్జెట్ తో రూపొందిన 'మగధీర" అంతకు రెండింతలు వసూలు చేసి తెలుగు సినిమా స్టామినా తెలియజేసింది. దీంతో ఇప్పుడు ప్రజాదరణ మెండుగా వున్న స్టార్ హీరోలతో ఖర్చుకి వెనకాడకుండా సినమాలు నిర్మించడానికి నిర్మాతల్లో నమ్మకం పెరిగింది.
మహేష్ హీరోగా సురేందర్ దర్శకత్వంలో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ 'మిస్టర్ పర్ ఫెక్ట్ అనే చిత్రాన్ని ప్రకటించింది. ఈ చిత్రానికి నలబై కోట్లు వెచ్చిస్తామని ప్రకటించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. సురేందర్ చెప్పిన కథ తనని మెస్మరైజ్ చేసిందని, ఖచ్చితంగా ఈ చిత్రం తన కెరీర్ లో మరపురాని చిత్రంగా నిలుస్తుందని మహేష్ పేర్కొనడంతో 'మిస్టర్ పర్ ఫెక్ట్" పై అందరి ధష్టి పడింది. అయితే ఇంత బడ్జెట్ తో సినిమా రూపొందినితంగా 'మగధీర" మాదిరి చారిత్రిక విజయం సాధించాల్సి వుంటుంది. అంత నమ్మకంగా నలబై కోట్లు పెట్టడానికి నిర్మాత సాహసిస్తున్నాడంటే కచ్చితంగా త్వరలోనే మరో 'మగధీర" స్థాయి విజయాన్ని మనం వీక్షంచబోతున్నామా!?