twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎప్పటికీ రుణ పడే ఉంటాను.. ప్రియమణి ఎమోషనల్ ట్వీట్

    |

    ఒక్కో హీరోయిన్‌కు కనీసం ఒక్కో ల్యాండ్ మార్క్ సినిమా ఉంటుంది. అలాంటి సినిమాల్లో హీరోయిన్ ప్రియమణికి గోలీమార్ ఒకటి. పవిత్ర క్యారెక్టర్‌లో ప్రియమణి జీవించేసింది. కమర్షియల్ సక్సెస్‌ను పక్కన బెడితే అన్ని కోణాల్లో ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా చక్రి అందించిన పాటలు ఓ రేంజ్‌లో దుమ్ములేపాయి. మరీ ముఖ్యంగా మగాళ్లు వట్టి మాయగాళ్లే అన్న పాట అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. నేటికి ఈ చిత్రం విడుదలై పదేళ్లు గడిచింది. ఈ సందర్భంగా ప్రియమణి సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

    గోలీమార్ చిత్రానికి పదేళ్లు కావడంతో ఈ మేరకు సోషల్ మీడియాలో అంతా దాని గురించే చర్చ నడుస్తోంది. ఇక ప్రియమణి స్పందిస్తూ.. 'ఇలాంటి అద్భుతమైన చిత్రంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు థన్యవాదాలు పూరి సర్. ఎన్నో అద్భుత క్షణాలున్నాయ్.. అవి ఎప్పటికీ మరిచిపోలేను. ఎప్పటికీ రుణం తీర్చుకోలేను. అద్భుతమైన సహ నటుడు గోపీచంద్‌కు ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేసింది.

    priyamani and Puri jagannadh About 10 Years Of Golimaar

    ప్రియమణి ట్వీట్‌కు స్పందించిన పూరీ జగన్నాద్.. మగాళ్లు వొట్టి మాయగాళ్లే.. అంటూ నవ్వుతున్న, దండం పెడుతున్న ఎమోజీలను షేర్ చేస్తూ మిస్ యూ అని ట్వీట్ చేశాడు. పూరీ చేసిన ఈ ట్వీట్‌కు చార్మీ స్పందిస్తూ.. భాస్కరభట్ల పాటల్లో నాకు నచ్చిన పాట ఇదే.. అంటూచెప్పుకొచ్చింది. దీనికి పాటల రచయిత భాస్కర భట్ల స్పందిస్తూ.. పూరి అన్నయ్యకు ధన్యవాదాలు.. అంటూ ఛార్మీ ఓ దండం పెట్టేశాడు. మొత్తానికి గోలీమార్‌కు దశాబ్దం నిండటం ఏమో గానీ వీరి ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

    English summary
    priyamani and Puri jagannadh About 10 Years Of Golimaar. She Says That Thank you for making me part of this wonderful movie purijagan sir!!! Will always cherish the wonderful memories!! Forever indebted
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X