అబ్బా...ప్రియమణి మళ్లీ పెంచింది!!

ఈలోగా 'పరుత్తి వీరన్' లో ఆమె పాత్రకి జాతీయ అవార్డు వచ్చింది. దాంతో ఆమె మళ్ళీ ఉత్సాహ తెచ్చుకుని 45-50 మద్యకు తన రెమ్యునేషన్ పెంచింది. ఈ పెంచిన రేటుతో తాజాగా భరత్ ప్రక్కన ఆర్ముగం చిత్రంలో బుక్కయింది. ఇంతలో మణిరత్నం దగ్గరనుండి కబురు రావటం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే నిర్మాతల్లో మాత్రం మళ్ళీ రేటు పెంచుతుందా అని గుండె గుబులు ప్రారంభమయిందిట. షేరు మార్కెట్ లా రోజు రోజుకీ పరిస్ధితులను బట్టి తన స్టాటజీని మార్చుకుంటూ అనుగుణంగా రెమ్యునేషన్ పెంచటం ఆమెకే చెల్లిందంటూ తోటి హీరోయిన్లు విమర్శిస్తున్నారు.


Click it and Unblock the Notifications











