పెళ్లయిన కొత్తలో సినిమాతో పాపులర్ అయిన ప్రియమణి కొత్త హీరోలతోనూ,డిమాండు లో లేని చిన్న వారితోనూ చేయనంటూ కండీషన్స్ పెడుతోంది.చెప్పుకోవుడానికి ఇష్టపడక పోయినా ఎవరే అతగాడు ఆమె మొదటి సినిమా. అందులో ఒకప్పటి నిర్మాత కె.యస్.రామారావు తనయుడు వల్లభ తెరంగ్రేటం చేసాడు.కాని ఆ సినిమా మిజరబుల్ ప్లాప్ అయింది.తరువాత " పెళ్లయిన కొత్తలో" దాకా ఆమెను పలకరించిన వాళ్ళు లేరు. తర్వాత వచ్చిన యమదొంగ తో ఆమె దశ తిరిగి పోయింది.కాని తర్వాత వచ్చిన టాస్ ( రాజా),భయ్యా(విశాల్),నవ వసంతం(తరుణ్)సినిమాలు ఆమెను బాగా నిరాశ పరిచాయి.దాంతో ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లుంది.మరో ప్రక్క తమిళం లో చేసిన పరుత్తివీరన్ సూపర్ హిట్ అయి అనేక అవకాశాలు తెచ్చిపెట్టింది. ఈలోగా బాలకృష్ణ ప్రక్కన రంగా..పాండు రంగా లో బుక్కవటం కొంత ఊరటను కొత్త ఆలోచనను ఇచ్చింది.దాంతో ఆర్ధికంగానూ,కెరీర్ పరంగానూ నిలదొక్కుకోటానికి ఈ తరహా వ్యూహం అవలంభిస్తోంది.