Don't Miss!
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
కథే వినలేదు..డబ్బు కోసం చేసా: ప్రియమణి
నిజం చెప్పాలంటే అసలు 'రాజ్' సినిమా కథే వినలేదు. ఏదో చూఛాయగా చెప్పారంతే! దర్శకుడి మీద, నిర్మాతల మీద నమ్మకంతో సినిమా ఒప్పుకొన్నాను.. అయినా సినిమాలు చేసేది డబ్బులు సంపాదించడానికే కదా అని తేల్చేసింది ప్రియమణి. రీసెంట్ గా రిలీజైన రాజ్ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.సుమంత్, ప్రియమణి,విమలారామన్ కాంబినేషన్ లో వియన్ ఆదిత్య తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ రాజ్. ఆ చిత్రం చేయటానికి మీరు ఏ అంశాలు పరిగణనలోకి తీసుకున్నారనే విషయం మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగని ప్రతీసారీ కథ వినకుండా ఒప్పుకునే ప్రసక్తి లేదంటోంది. కథ కూడా ముఖ్యమే. అయితే దర్శకుడు సినిమాని ఎంత వరకూ సమర్థంగా తెరకెక్కించగలరు అనే విషయం మీద నమ్మకం కుదిరితే మరే విషయాలూ ఆలోచించను అంది. ప్రస్తుతం ప్రియమణి...బెల్లంకొండ సురేష్ నిర్మాతగా గోపిచంద్ మలినేని దర్సకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందే బాడీగార్డ్ రీమేక్ కమిటైంది.