Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాజమౌళిని తప్ప...డైరెక్టర్లందరినీ ఏకి పారేసిన హీరోయిన్
హైదరాబాద్: హీరోయిన్ ప్రియమణి టాలీవుడ్ దర్శకులపై తనదైన రీతిలో విమర్శల వర్షం కురిపించింది. టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళిని తప్ప అందరు దర్శకులను ఓ రేంజిలో ఏకి పారేసంది. రాజమౌళి తప్పించి మరే దర్శకుడూ ప్రియమణి టాలెంట్ సరైన విధంగా వాడుకోలేదని తెగ బాధ పడుతోంది.
ఒక రకంగా చెప్పాలంటే దర్శకులు తనను, తన టాలెంటును సరిగా వాడుకోక పోవడం వల్లనే తాను ఎదగలేక పోయానని పరోక్షంగా ఆరోపిస్తోంది ఈ మళయాలీ బ్యూటీ. యమదొంగ సినిమాలో రాజమౌళి ఇచ్చిన పాత్ర తనకి నటిగా సంతృప్తినిచ్చిందని చెప్తున్న ప్రియమణి తెలుగు దర్శకులలో లోపించిన ప్రొఫెషనలిజం కారణంగా మరిన్ని మంచి పాత్రలు తనకి లభించట్లేదని వాపోయింది.
ప్రస్తుతం ప్రియమణికి తెలుగులో అవకాశాలు ఏమీ లేవు. ఈ మధ్య ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాపవ్వడమే ఇందుకు కారణం. అంగుళీక అనే చిత్రం కొంత షూటింగ్ జరుపుకున్నా....అది పోప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. దీంతో చేసేది లేక ఇతర బాషా చిత్రాల వైపు గేర్ మార్చింది.
ఇదే విషయాన్ని ప్రియమణి వద్ద ప్రశ్నిస్తే.......తెలుగులో అవకాశాలు వస్తున్నాయి కానీ, తనకు సంతృప్తిని ఇచ్చే పాత్రలు రావడం లేదని, సరైన పాత్ర కోసం ఎదురు చూస్తున్నానని చెబుతోంది. ప్రస్తుతం ఆమె కన్నడలో అంబరీష అనే చిత్రంలో నటిస్తోంది. మరి కన్నడ చిత్రసీమలో అయినా ప్రియమణి దశ తిరుగుతుందో? లేదో? చూడాలి.