ప్రియాంక చోప్రాకు దాదా ఫాల్కే అకాడమీ అవార్డ్
బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా అరుదైన గౌరవం దక్కింది. భారత్కు అంతర్జాతీయ ప్రతీకగా నిలిచినందుకు ఆమె దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు.
ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. భారత్కు అంతర్జాతీయ ప్రతీకగా నిలిచినందుకు ఆమె దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. జూన్ 1న ఆమె ముంబైలో ఈ అవార్డును అందుకోనున్నారు.
దాదా ఫాల్కే అకాడమీ అవార్డుల్లో ఇటీవలే కొత్తగా ప్రవేశ పెట్టిన అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి విభాగంలో ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. హాలీవుడ్ సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకుని భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెబుతున్నందుకుగాను ఆమెకు ఈ అవార్డు అందజేసారు.

ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సీరీస్ క్వాంటికోతో పాటు.... హాలీవుడ్ మూవీ 'బేవాచ్'లో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక చెప్రా పని తీరుతో దేశం గర్వించేలా ఉందని, అందుకే ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ, అవార్డు కమిటీ చైర్మన్ గణేశ్జైన్ తెలిపారు.
జానీ లివర్, పహ్లజ్ నిహ్లానీ, మిథున్ చక్రవర్తి, టీపీ అగర్వాల్ తదితరులతో కూడిన ఈ కమిటీ ప్రియాంక చోప్రాను ఏకగ్రీవంగా ఈ అవార్డుకు ఎంపిక చేసారు. జూన్ 1న జరిగే అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.


Click it and Unblock the Notifications











