Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శ్రీవారి సన్నిధిలో... జంజీర్ హీరోయిన్
తిరుపతి: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మంగళవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రియాంకతో పాటు ఆమె కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నపారు. మంగళవారం ఎర్లీమార్నింగ్ బ్రేక్లో వారికి ప్రత్యేక దర్శనం కల్పించారు దేవస్థానం అధికారులు. తాను నటించిన బర్ఫీ చిత్రం ఆస్కార్ నామినేషన్కు వెళ్లి నేపథ్యంలో ప్రియాంక శ్రీవారి దర్శనానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ తాజా చిత్రం 'జంజీర్' లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం ఒక విశేషమైతే.... ప్రియాంక చోప్రా ఈ చిత్రం ద్వారా తొలిసారి తన సింగింగ్ టాలెంట్ చూపించబోతోంది. దర్శకుడు అపూర్వ లఖియా ఆమెతో ఈచిత్రంలో ఆమెతో ఓ పాట పాడించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదంతా చిత్రంపై హైప్ పెంచడానికే అని బాలీవుడ్ టాక్.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఒక కొత్త హీరో ప్రక్కన అదీ లాంచింగ్ సినిమాలో చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దానికి అసలు కారణం ప్రియాంక చోప్రా రీసెంట్ గా రివీల్ చేసింది. అది మరేదో కాదు..తనకు అమితాబ్ బచ్చన్ అంటే విపరీతమైన ఇష్టం అని..ఆయన సినిమాలు ఏది రీమేక్ చేసినా తానే హీరోయిన్ గా చేస్తానని ప్రకటించింది.
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్కు యాంగ్రీ యంగ్మెన్గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది.