Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
తెలంగాణ వాడిని కావటం వల్లే నా సినిమాకి...
హైదరాబాద్ : షూటింగ్ పూర్తయి, పాటలు విడుదలై కూడా సంవత్సరం గడిచింది. అయినా సినిమా విడుదలవ్వలేదు. తెలంగాణవాడిని కావడం వల్లే.. సినిమా పేరులో తెలంగాణ అని ఉండటం వల్లే ఇలా జరిగింది''అని ఆరోపించారు దర్శకనిర్మాత తుమ్మల రమేష్ రెడ్డి. ఆయన తాజా చిత్రం తెలంగాణ గోదావరి.
తుమ్మల రమేష్ రెడ్డి మాట్లాడుతూ ...ఆస్కార్ అవార్డు తీసుకోవాలనే ఆశయంతో ఆస్ట్రేలియాలో శిక్షణ తీసుకున్నాను. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికే తిరిగి సొంత గడ్డపైకి వచ్చాను. ఉద్యమ నేపథ్యంలోనే గతంలో 'నాతల్లి తెలంగాణ' చిత్రం తీశాను. అప్పుడూ ఇలాంటి బాధలే పడ్డాను అన్నారు.
అలాగే ఇప్పుడూ అంతే. అనేక బెదిరింపులు వచ్చాయి. సెన్సార్ బోర్డు నుంచి అనవసర అభ్యంతరాలు వస్తున్నాయి. ఎన్ని ఆటంకాలైనా ఎదుర్కొంటాను. వచ్చే నెలలో విడుదల చేస్తాను అన్నారు.
రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ''తెలంగాణ పోరాటానికి గోదావరితో సంబంధముంది. రమేష్రెడ్డి ఎంతో ఆరాటంతో ఈ సినిమా తీశారు. విడుదల కాకుండా అడ్డుపడటం సమంజసం కాదు''అన్నారు.