'ఆర్య-2' ప్రదర్శన నిలిపేస్తున్నా: నిర్మాత ఆదిత్య బాబు
ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై ఆదిత్యబాబు నిర్మించిన 'ఆర్య-2' చిత్ర ప్రదర్శనను శుక్రవారం నుంచి నైజాం ఏరియాలో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు చిత్ర నిర్మాత ఆదిత్యబాబు తెలిపారు. నైజాం ఏరియాలో ఈ చిత్ర ప్రదర్శనను కొద్ది రోజులుగా పంపిణీదారులు నిలిపివేశారని, శుక్రవారం నుంచి తానే ఈ చిత్ర ప్రదర్శనను తాత్కాలికంగా నిలపాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో తిరిగి ఎప్పటి నుంచి ప్రదర్శించేదీ తరువాత ప్రకటిస్తానని ఆయన తెలిపారు. అల్లు అర్జున్, కాజల్ కాంబినేషన్ లో సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం టాక్ పరంగా ఫ్లాఫ్ అనిపించుకున్నా కలెక్షన్స్ పరంగా బెస్ట్ అనిపించుకుంది. అయితే మేజర్ షేర్ తెచ్చే నైజాం ఏరియాలో ఈ చిత్రం ప్రదర్శనను అడ్డుకోవటంతో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.
More from Filmibeat
ఆర్య 2 అల్లు అర్జున్ సుకుమార్ కాజల్ నవదీప్ తెలంగాణ ఆదిత్య బాబు arya 2 allu arjun sukumar kajal navdeep telangana aditya babu


Click it and Unblock the Notifications











