Don't Miss!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘మహానటి’ టీంకు అల్లు అరవింద్ గ్రాండ్ పార్టీ... బన్నీ, రాజమౌళి సందడి (ఫోటోస్)
Recommended Video
ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్తో దూసుకెళుతోంది. సినిమా విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. యూఎస్ఏలో ఈ చిత్రం ఐదు రోజుల్లోపే 1 మిలియన్ డాలర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం వసూళ్లు అదుర్స్ అనే విధంగా ఉన్నాయి. కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు గొప్ప సినిమా తీశారంటూ ప్రముఖుల నుండి, సినీ విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల చిరంజీవి చిత్ర బృందాన్ని సత్కరించగా, తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
అల్లు అర్జున్, రాజమౌళి సందడి
అల్లు అరవింద్ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో మహానటి నిర్మాతలు అశ్వినీ దత్, ప్రియాంక దత్, స్వప్నదత్తో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. ఈ పార్టీలో అల్లు అర్జున్, ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి సైతం పాల్గొని సందడి చేశారు.
గర్వపడే సినిమా తీశారంటూ బన్నీ కామెంట్
‘మానాన్న గారు ఆయన స్నేహితుడు, భాగస్వామి అశ్వినీ దత్గారికి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ‘మహానటి' లాంటి ఎంతో గొప్ప సినిమాను ప్రేక్షకులకు అందించారాయన, దర్శకుడు నాగ్ అశ్విన్ మనమంతా గర్వపడే సినిమా తీశారు. ఎంటైర్ టీమ్కు కంగ్రాట్స్.... అంటూ అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి సైతం
‘మహానటి' చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవల సత్కరించిన సంగతి తెలిసిందే. కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇంత గొప్ప సినిమా తీసిన దర్శకుడు నాగ్ అశ్విన్ టాలెంట్ను మెచ్చుకున్నారు.
తమిళంలో కూడా సూపర్ హిట్
‘మహానటి' చిత్రం తమిళంలో నడిగైయార్ తిలగం పేరుతో విడుదలైంది. తమిళనాడులో కూడా ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు సూపర్ హిట్ టాక్తో మంచి వసూళ్లు సాధిస్తోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించారు.