twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమా...అశ్వనీదత్‌ ?

    By Staff
    |

    Ashwini Dutt
    'వీడియో పైరసీ కారణంగా ఇప్పటికే థియేటర్లకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతున్న గడ్డు పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ విధానాన్ని అధికారికంగా గెలాక్సీ అనే దళారీ సంస్థకు కట్టబెట్టి ప్రతి టిక్కెట్‌ మీద ఆరు రూపాయలు ప్రేక్షకుడికి అదనపు భారం వెయ్యడం చాలా తప్పు. ఒక విధంగా ఇది బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముకోవడం వంటిదే. ఈ నిర్ణయం చిత్ర పరిశ్రమకు చేటు అని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ మండిపడ్డారు.

    ఇలాంటి తప్పుడు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. వీలయితే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పాటు పడాలి కానీ ప్రేక్షకులకు ఇంకా అదనపు భారాన్ని వేసే ఇలాంటి నిర్ణయాల వల్ల పరిశ్రమ మరింత దెబ్బతింటుంది. ప్రేక్షకుడికి, థియేటర్‌కు మధ్య గెలాక్సీ ఎంటర్‌టైనర్‌ వంటి దళారీ సంస్థల ప్రమేయం లేకుండా డైరెక్ట్‌గా థియేటర్ల నుండి ప్రేక్షకులు టిక్కెట్లు కొనుక్కునే సిస్టమ్‌ వల్ల పరిశ్రమకు మేలు జరుగుతుంది. ఈ యోచనను వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలి'' అన్నారు అశ్వనీదత్‌.

    అయితే అప్పట్లో (జై చిరంజీవ) టైములో సినిమా టిక్కెటు రేటు పెంచుకోమని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జీవో తెచ్చుకున్న అశ్వనీదత్ ఇవాళ ప్రేక్షకులకు ఎక్కువ భారం పడతాయనటం,బాధపడటం గురివింద సామెతలా ఉందని కొందరు బహరింగ విమర్శలు చేస్తున్నారు. ఆ గెలాక్సీ కి ఇచ్చేదేదో తనకే ఇస్తే...ఇలాంటి డైలాగులు రావంటున్నారు. అయితే ఈ కామెంట్స్ చేసేవారు ఏది మనసులో అంటున్నా...విన్నవారు మాత్రం ఆలోచనలో పడుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X