Don't Miss!
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
'మీ శ్రేయాభిలాషి' నిర్మాత సీసీ రెడ్డి మృతి
హైదరాబాద్ : చలన చిత్ర నిర్మాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డ్డి ప్రభుత్వంలో ఐటీ శాఖ సలహాదారుగా వ్యవహరించిన సి.సి.రెడ్డి అనారోగ్యంతో సోమవారం రాత్రి ఇక్కడి బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన వయస్సు 78 ఏళ్లు.
సి.సి.రెడ్డి కొంత కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ.. డయాలసిస్ చేయించుకుంటున్నారు. సోమవారం డయాలసిస్ చేయంచుకునేందుకు ఆసుపత్రికి వెళ్లారు. ఆ పక్రియ కొనసాగుతుండగానే... ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
సి.సి. రెడ్డి ..గౌతమ్ ఎస్ ఎస్ సి, రూమ్ మేట్స్, మీ శ్రేయాభిలాషి చిత్రాలు నిర్మించారు. 'వెంగళ్రెడ్డి అంతర్జాతీయ ఎడ్యుకేషన్ సొసైటీ'ని సి.సి.రెడ్డి స్థాపించారు. పారిశ్రామికవేత్తగా పేరున్న సి.సి.రెడ్డి విసు కన్సల్టెన్సీ ద్వారా ఎందరో విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించారు. అలాగే ఈ భూమి అనే పత్రికను సైతం ఆయన ఎడిటర్ గా నడిపారు. ఆయన మృతికి వన్ ఇండియా తెలుగు సంతాపం తెలియచేస్తూ... నివాళిలు అర్పిస్తోంది.