Don't Miss!
- News ఏపీలో కేసుల్లో ఈయనే టాప్; సెంచరీకి చేరువగా టీడీపీ అభ్యర్థిపై కేసులు!!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'మీ శ్రేయాభిలాషి' నిర్మాత సీసీ రెడ్డి మృతి
హైదరాబాద్ : చలన చిత్ర నిర్మాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డ్డి ప్రభుత్వంలో ఐటీ శాఖ సలహాదారుగా వ్యవహరించిన సి.సి.రెడ్డి అనారోగ్యంతో సోమవారం రాత్రి ఇక్కడి బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన వయస్సు 78 ఏళ్లు.
సి.సి.రెడ్డి కొంత కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ.. డయాలసిస్ చేయించుకుంటున్నారు. సోమవారం డయాలసిస్ చేయంచుకునేందుకు ఆసుపత్రికి వెళ్లారు. ఆ పక్రియ కొనసాగుతుండగానే... ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
సి.సి. రెడ్డి ..గౌతమ్ ఎస్ ఎస్ సి, రూమ్ మేట్స్, మీ శ్రేయాభిలాషి చిత్రాలు నిర్మించారు. 'వెంగళ్రెడ్డి అంతర్జాతీయ ఎడ్యుకేషన్ సొసైటీ'ని సి.సి.రెడ్డి స్థాపించారు. పారిశ్రామికవేత్తగా పేరున్న సి.సి.రెడ్డి విసు కన్సల్టెన్సీ ద్వారా ఎందరో విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించారు. అలాగే ఈ భూమి అనే పత్రికను సైతం ఆయన ఎడిటర్ గా నడిపారు. ఆయన మృతికి వన్ ఇండియా తెలుగు సంతాపం తెలియచేస్తూ... నివాళిలు అర్పిస్తోంది.