Don't Miss!
- Technology వన్ప్లస్ 12R స్పెషన్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. బ్యాంకు ఆఫర్ల ద్వారా ధర తగ్గింపు..!
- Sports IPL 2024: ‘నా గుండె పగిలింది’ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం!
- Finance Layoff News: యూనీలివర్ 7,500 ఉద్యోగుల కోత.. పూర్తి వివరాలివే..
- Lifestyle Chapathi Kurma: చిటికెలో రుచికరంగా చపాతీ కుర్మా రిసిపి రెడీ.
- News Plume: భారత్ లో అంతర్జాతీయ సంస్ధ ప్లూమ్ తొలి ఆఫీసు ప్రారంభం- ప్రత్యేకతలివే..!
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
నిర్మాత డి. సురేష్ బాబు కారు బీభత్సం... చిన్నారితో పాటు దంపతులు తీవ్ర గాయాలు!
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు సికింద్రాబాద్ ఏరియాలో బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారితో పాటు దంపతులకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు ఐపీసీ 337 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంపీరియల్ గార్డెన్స్ సమీపంలో సురేష్ బాబుకు చెందిన టీఎస్09ఈఎక్స్2668 నెంబరు గల కారు రాంగ్ రూట్లో వెళుతూ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దంపతులు సతీష్ చంద్ర(35), దుర్గ దేవి(30), సిద్దేశ్ చంద్ర(3)లు గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాత్రి 10.30 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సతీష్ చంద్ర తన బంధువులను కలిసేందుకు కెపిహెచ్బి కాలనీ నుంచి తాడ్బండ్ మీదుగా లాలాగుడూ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనపై కార్ఖానా పరిధి పోలీసులు నిర్మాత సురేష్ బాబుకు 41ఏ నోటీసులు జారీ చేశారు. కేసు విచారణకు హాజరు కావాల్సి ఉందని అందులో పేర్కొనట్లు సమాచారం.