Don't Miss!
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నిర్మాత డి. సురేష్ బాబు కారు బీభత్సం... చిన్నారితో పాటు దంపతులు తీవ్ర గాయాలు!
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు సికింద్రాబాద్ ఏరియాలో బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారితో పాటు దంపతులకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు ఐపీసీ 337 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంపీరియల్ గార్డెన్స్ సమీపంలో సురేష్ బాబుకు చెందిన టీఎస్09ఈఎక్స్2668 నెంబరు గల కారు రాంగ్ రూట్లో వెళుతూ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దంపతులు సతీష్ చంద్ర(35), దుర్గ దేవి(30), సిద్దేశ్ చంద్ర(3)లు గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాత్రి 10.30 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సతీష్ చంద్ర తన బంధువులను కలిసేందుకు కెపిహెచ్బి కాలనీ నుంచి తాడ్బండ్ మీదుగా లాలాగుడూ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనపై కార్ఖానా పరిధి పోలీసులు నిర్మాత సురేష్ బాబుకు 41ఏ నోటీసులు జారీ చేశారు. కేసు విచారణకు హాజరు కావాల్సి ఉందని అందులో పేర్కొనట్లు సమాచారం.