Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'అలా.. మొదలైంది' చిత్రం బయ్యర్లు రారనే...
చిన్న సినిమాకి బయ్యర్లు రారు కాబట్టి ప్రేక్షకుల్ని నమ్మి సొంతంగానే రిలీజ్ చేశాం...అంటున్నారు నిర్మాత కె.ఎల్. దామోదర్ప్రసాద్. నాని, నిత్యమీనన్ కాంబినేషన్ లో శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం 'అలా..మొదలైంది'. బి.వి. నందినిరెడ్డి దర్శకురాలిగా పరిచయమైన ఈ చిత్రం క్రిందటవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుని విజయ పధంలో దూసుకుపోతోంది.ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని పంచుకోవటానికి మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే...ఈ సినిమా చేయడానికి ముందు యాభై పైగా కథలు విన్నా. వారిలో దర్శకులమవుదామన్న వారినుంచి నాలుగైదు సినిమాలు చేసిన డైరెక్టర్ల దాకా ఉన్నారు. నందిని చెప్పిన కథ ట్రీట్ మెంట్ పరంగా బాగుంది. పురుషాధిక్య రంగంలో ఈ అమ్మాయి రావడమే విశేషం. రాఘవేంద్రరావు, కృష్ణవంశీ వద్ద పనిచేశానని చెప్పింది. నాకంటే ముందు చాలామంది నిర్మాతల చుట్టూ తిరిగింది అవకాశాల కోసం. ఆమె వేవ్లెంగ్త్ నాకు మ్యాచ్ అయ్యింది. సినిమాని బాగా ఎగ్జిక్యూట్ చేయగలదనిపించింది. అందుకే అవకాశమిచ్చా. కచ్చితంగా ఆమె పైకి వస్తుందనే నమ్మకం. ఇది సింపుల్ పాయింట్ మీద తీసిన సినిమా. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్ప్లే. స్వచ్ఛమైన వినోదాత్మక చిత్రం అందుకే వర్కవుట్ అయింది అన్నారు.