Don't Miss!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చూస్తుంటే గుండె ఆగిపోతుందానిపించింది
సినిమా చూసినవారంతా చాలా భయపడ్డామని, కొన్ని సన్నివేశాలు చూస్తుంటే గుండె ఆగిపోతుందానిపించిందని అంటున్నారు. కలెక్షన్లు బాగున్నాయి అని చెప్తున్నారు ప్రశాంత్ బుర్ర. ఆయన రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'ఆవహం' చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి నిర్మాత. ఈ చిత్రం క్రితం శుక్రవారం రిలీజ్ అయింది. ఈ చిత్రం ప్రమోట్ చేసుకునే భాగంగా మీడియాతో మాట్లాడుతూ....'ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కూడా మా 'ఆవహం' చిత్రం చూసి భయపడటానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నందుకు వారికి మా ధన్యవాదాలు' అన్నారు. అలాగే 'ఫూంక్ సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది కానీ ఆ చిత్రానికీ దీనికీ సంబంధం లేదు అని తేల్చేసారు. ఇక ముఖ్యంగా నైజాం ఏరియాలో స్టూడెంట్స్ ఈ సినిమా చూడటానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ హాట్ సమ్మర్ లో మంచి సినిమా అందించినందుకు ఆనందంగా ఉంది' అన్నారు ప్రశాంత్ బుర్ర. మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న 'ఆవహం' నిజానికి ఎవరినీ భయపెట్టకపోవటంతో మొదటి రోజే ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.