Don't Miss!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- News ఏపీలో ఇప్పటివరకు భారీగా పట్టుబడిన నగదు, మద్యం, బంగారం.. అత్యధికంగా ఎక్కడంటే
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ రాతలకు హర్ట్ అయిన దిల్ రాజు... కోట్లలో వ్యాపారం, నిర్దాక్షిణ్యంగా!
Recommended Video
నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా 'శ్రీనివాస కళ్యాణం'. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. పెళ్లి విశిష్టతను తెలియజెప్పే కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన గురించి తప్పుడు రాతలు రాసిన వారిపై ఫైర్ అయ్యారు.
ముందే సినిమా చూపాలంటే భయం
రిలీజ్కు ఐదు రోజుల ముందు డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించాలంటే నిర్మాతకు భయం.... సినిమా నచ్చకపోతే డబ్బులు కట్టరేమో అని. కానీ నా డిస్ట్రిబ్యూటర్లకు పిలిచి చూపిస్తాను. అది మంచైనా, చెడైనా... సంతోషంగా స్వీకరిస్తాను అని దిల్ రాజు తెలిపారు.
ఆయన చాలా నిర్దాక్షిణ్యంగా చెబుతారు
ఈస్ట్ డిస్టిబ్యూటర్ ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటారంటే సినిమా బావుంటే ఎలా పొగుడుతారో, బాగోలేకుంటే అలాగే తిడతారు. ఆయనలాగే నా టెక్నీషియన్స్, అందరూ ఏండాలని కోరుకుంటాను. అప్పుడే సినిమా గురించి నిజం మాకు తెలుస్తుందని దిల్ రాజు అన్నారు.
కోట్లలో వ్యాపారం... దమ్ముండాలి
ఓ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ.... మాకు సినిమా చూపించే దమ్ము ఈ రోజుల్లో ఎవరికీ ఉండదు. ఎందుకంటే అది కోట్ల మీద వ్యాపారం. అలాంటిది మమ్మల్ని పిలిచి చూపిస్తున్నారంటే.... ముందే ఫిక్స్ అయ్యాం. ఆయన సినిమా చూపిస్తామని చెప్పగానే సినిమా హిట్టని ఫిక్స్ అయ్యాం. చూసిన తర్వాత మాటల్లేవు అని వ్యాఖ్యానించారు. మరో డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ.. దిల్ రాజు, వెంకటేశ్వర క్రియేషన్స్ స్థాయిని పది రెట్లు పెంచే సినిమా ఇది. ఇలాంటి సినిమాను విడుదల చేస్తున్నందుకు గర్వ పడుతున్నామన్నారు.
అలా రాయడం నన్ను హర్ట్ చేసింది
దర్శకుడు సతీష్ వేగశ్న కథ చెప్పగానే జయసుధ, నితిన్, ప్రకాష్ రాజ్ కథ చాలా బావుందని చెప్పారు. కథ చెప్పడం వేరు, దాన్ని సినిమాగా మలచడం వేరు. కథ అనుకున్నదగ్గరి నుండి సతీష్, నేను, మా టీం అంతా ట్రావెలైన విధానం మాకు మాత్రమే తెలుసు. ఏదో వెబ్ సైట్లో దిల్ రాజు దీనికి డెబ్యూ డైరెక్టర్గా చేశాడు... అని రాశారు. అది చూసి చాలా హర్ట్ అయ్యాను. దయచేసి నేను కోరుకునేది ఒకటే. అది దర్శకుల సినిమా. నేను వెనకాల ఉంటాను... అందరూ ఇది గుర్తుంచుకోవాలి అని దిల్ రాజు అన్నారు.
అతడితో మరో సినిమా
ప్రతి ఒక్క దర్శకుడికి తనలో ఒక కసి ఉంటుంది. సతీష్తో నెక్ట్స్ మూవీ కూడా చేయబోతున్నాను. నిర్మాత, దర్శకుడి రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటే స్ట్రాంగ్ మూవీ వస్తుందని శతమానంభవతి రుజువు చేసిందని దిల్ రాజు అన్నారు.
ప్రేక్షకుల నిర్ణయమే ఫైనల్
ఇపుడు సినిమా చూసినవారంతా బావుందని చెబుతున్నారు. ఆగస్టు 9న ప్రేక్షకులు చెప్పే వరకు వెయిట్ చేయాలి. మరో మూడు రోజులు ఇదే ఎమోషన్తో వెయిట్ చేస్తాం. కానీ ఎలాంటి డౌట్ లేదు. అందరు చెప్పిన దాంట్లో 100 శాతం లేకున్నా 90 శాతం అయితే తప్పకుండా ఉంటుందన్నారు. దిల్ రాజు.