Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రెండో పెళ్లి తరువాత దిల్ రాజు షాకింగ్ నిర్ణయం.. అనాధ పిల్లలను దత్తత తీసుకుంటూ..
టాలీవుడ్ సీనియర్ నిర్మాత దిల్ రాజు మరో కీలక నిర్ణయంతో హాట్ టాపిక్ గా నిలిచారు. లాక్ డౌన్ లో ఎవరు ఊహించని విధంగా రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ఇద్దరు అనాధ పిల్లలను చేరదీసి తన మంచి మనసును చాటుకున్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు పిల్లల తల్లిదండ్రులును కోల్పోవడంతో దిక్కులేని వారయ్యారు. దీంతో వారి పరిస్థితిని గమనించి దత్తత తీసుకోవాలని దిల్ రాజు ముందుకు వచ్చారు.
రెండో పెళ్లి తరువాత కొత్తగా..
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత దిల్ రాజు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లవుతోంది. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి ఆ తరువాత స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన దిల్ రాజు చూస్తుండగానే సౌత్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ లలో ఒకటిగా తన సంస్థను నిలిపాడు. ఇక ఇటీవల వివాహం చేసుకున్న దిల్ రాజు సరికొత్తగా నిర్ణయాలతో కనిపిస్తున్నాడు. ఆయన రెండో భార్య వ్యఘా రెడ్డి అలియాస్ తేజస్విని వలన జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఆ ఇద్దరు పిల్లలు అనాధలు కావడంతో
ఇక ఇటీవల ఈ నిర్మాత ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవడం అందరిని ఎంతగానో ఆకర్షించింది. పిల్లల వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా ఆత్మకూరుకు చెందిన గట్టు సత్తాయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అనంతరం అతని భార్య అనురాధ బాధతో రెండు రోజుల క్రితం ప్రాణాలు విడిచారు. దీంతో వారి ఇద్దరు పిల్లలు మనోహర్, లాస్య ఒక్కసారిగా దిక్కులేని వారయ్యారు.
Recommended Video
ఏ మాత్రం సందేహించకుండా..
విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్ వెంటనే దిల్ రాజుకు ఆ పిల్లల పరిస్థితి గురించి వివరించడంతో ఏ మాత్రం సందేహించకుండా వారి పూర్తి బాధ్యతలను తాను తీసుకుంటానాని దిల్ రాజు అన్నారు. దిల్ రాజుకి చెందిన మా పల్లె చారిటబుల్ ట్రస్టు ద్వారా వారి జీవితానికి ఏ లోటు లేకుండా చూస్తామని మాట ఇచ్చారు. దిల్ రాజు తీసుకున్న నిర్ణయం పట్ల దయాకర్ రావు అభినందనలు తెలిపారు.