మహర్షి నెక్ట్స్ లెవెల్ మూవీ.. నాన్ బాహుబలి రికార్డుల బ్రేక్.. దిల్ రాజు
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సీ అశ్వినీదత్, పీవీపీ నిర్మాణ సారథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం విడుదలై మంచి స్పందనను కూడగట్టుకొంటున్నది. ఈ నేపథ్యంలో దిల్ రాజు, వంశీ పైడిపల్లి మీడియాతో మాట్లాడారు. సినిమా వసూలు చేస్తున్న కలెక్షన్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా దిల్ రాజు మాట్లాడుతూ..
మహర్షి చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ను కూడగట్టుకొన్నది. మహేష్ కెరీర్లోనే హయ్యెస్ట్ వసూళ్లను వసూలు చేసింది. ఈ కలెక్షన్లను ముందు మేము ఊహించిందే. అద్భుతమైన స్టార్ను ఇచ్చినందుకు థ్యాంక్స్.

నైజాంలో మహర్షి నాన్ బాహుబలి క్యాటగిరిలో రికార్డుగా నిలిచింది. ఏపీలో చాలా ప్రాంతాల్లో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. మరికొన్ని చోట్ల రెండోస్థానంలో ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ రికార్డుగా మైలురాయి సినిమాగా నిలువబోతున్నది. మహర్షి సినిమా నెక్ట్స్ లెవెల్కు వెళ్లబోతున్నదనే విషయం ఈ వసూళ్లు చెబుతున్నాయి. వేసవిలో రిలీజ్ అయిన సినిమాల్లో మహర్షి టాప్గా నిలిచింది అని దిల్ రాజు అన్నారు.
నా అనుభవం ప్రకారం.. మహర్షి సినిమా తెలుగు ఇండస్ట్రీలో టాప్ గ్రాసర్గా నిలువబోతున్నది అని చెప్పగలను. నాలుగు రోజులు ఆగితే సినిమా సత్తా ఏంటో తెలియడం ఖాయం.
మహర్షి రిలీజ్ తర్వాత తొలి ఆట డివైడ్ టాక్ వినిపించింది. ఫస్టాఫ్ అద్భుతంగా ఉండటం మూలంగా సెకండాఫ్ సినిమా కొంత స్లోగా అనిపించింది. చివరి 30 నిమిషాలు మళ్లీ ఫెంటాస్టిక్ అని అంటున్నారు. ఓవరాల్గా సినిమా బాగుందనే మాట వినిపిస్తున్నది. ఏది ఏమైనా ఈ సినిమా టాలీవుడ్లో నెక్ట్స్ లెవెల్కు వెళ్తుంది అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.


Click it and Unblock the Notifications











