twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ టైంలో రిలీజ్ అంటే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.. మహేష్ బాబు కొడుకు 2.0 చూడగానే!

    |

    సూపర్ స్టార్ రజనీకాంత్ 2.0 చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. శంకర్ ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమాకు గర్వకారణం అనే స్థాయిలో అద్భుతమైన విజువల్స్‌తో రూపొందించారు. శంకర్ దర్శత్వం, రజనీకాంత్ మ్యాజిక్ని ఆడియన్స్ ఆస్వాదిస్తున్నారు. అక్షయ్ కుమార్ భయంకరమైన విలన్‌గా అదరగొట్టేశాడు.ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించింది. 2.0 చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు విడుదల చేశారు. సినిమాకు వస్తున్న స్పందన గురించి ఆయన మీడియాతో మాట్లాడారు.

    అద్భుతంగా ఉంది

    అద్భుతంగా ఉంది

    2.0 చిత్రం విడుదలయ్యాక తాను ఇప్పటికే మూడు సార్లు సినిమాని చూశానని దిల్ రాజు అన్నారు. త్రీడీలో ఎంత అద్భుతంగా నిపించిందో 2డిలో కూడా అదే విధమైన అనుభూతో కలిగిందని దిల్ రాజు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ టాప్ హీరోల చిత్రాలకు ధీటుగా ఈ చిత్రానికి వసూళ్లు వస్తున్నాయని అన్నారు. 2.0 చిత్రం ఈ సమయంలో విడుదల కావడంతో దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    గుండెల్లో రైళ్లు

    గుండెల్లో రైళ్లు

    సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలలు సినిమాల విడుదలకు అనుకూలంగా ఉండవు. తాను ఈ రెండు నెలల్ని అన్ సీజన్‌గా భావిస్తారు. కానీ ఈ చిత్రాన్ని తమిళతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలనీ నిర్ణయించుకోవడం ఈ టైంలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ శంకర్ అద్భుతమైన చిత్రాన్ని తెరక్కించారు. ఇలాంటి చిత్రాలు ఆయనకు మాత్రమే సాధ్యం. శంకర్ లాంటి దర్శకుడు మళ్ళీ పుడతారేమో చూడాలి అని దిల్ రాజు ప్రశంసించారు.

     నెగిటివ్ కామెంట్స్

    నెగిటివ్ కామెంట్స్

    2.0 రిలీజ్ కు ముందు చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమా గురించి రకరకాలుగా మాట్లాడారు. దీనితో మేముకూడా కొంత భయపడ్డాం అని దిల్ రాజు అన్నారు. కానీ నాకు శంకర్ దర్శకత్వంపై నమ్మకం ఉంది. రోబో చిత్రంతోనే అంత చేశారు. ఇక 500 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రంలో ఆయన ఎదో ఒక మ్యాజిక్ చేసి ఉంటారని భావించానని దిల్ రాజు అన్నారు.

    రజనీకాంత్ క్రేజ్

    రజనీకాంత్ క్రేజ్

    టెక్నికల్‌గా ఎంత భారీ చిత్రం అయినా చివరి అరగంట సూపర్ స్టార్ రజని క్రేజ్‌ని దర్శకుడు అద్భుతంగా ఉపయోగించుకున్నారని దిల్ రాజు తెలిపారు. ఈచిత్రం లాంగ్ రన్‌లో మంచి వసూళ్లు సాధిస్తుంది. ఇలాంటి సినిమాని పైరసీలో చూస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. తప్పనిసరిగా థియేటర్స్ లో చూడాల్సిందే అని దిల్ రాజు పేర్కొన్నారు. సంక్రాంతి వరకు ఈ చిత్ర రన్ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    మహర్షి సెట్స్‌కి వచ్చి

    మహర్షి సెట్స్‌కి వచ్చి

    సూపర్ స్టార్ మహేష్ బాబు ఉదయమే మహర్షి సెట్స్ కి వచ్చి నాతో 2.0 చిత్రం గురించి మాట్లాడారు. ఏం తీశారండి శంకర్ గారు అని అన్నారు. గౌతమ్ ఈ చిత్రం చూడగానే డాడీ ఈ సినిమా మళ్ళీ చూడాలని తనతో అన్నట్లు మహేష్ తెలిపాడు. ఈసారి పిల్లలని బిగ్ స్క్రీన్ లో త్రీడీలో చూపిద్దాం అని మహేష్‌తో చెప్పినట్లు దిల్ రాజు పేర్కొన్నారు.

    English summary
    Producer Dil Raju Speaks about 2.0 Movie. 2.0 got good response says Dil Raju
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X