Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బ్యాగ్రౌండ్ లేదు అనొద్దు, రెజీనాను డైరెక్టర్ బాగా పిండేశాడు: దిల్ రాజు
Recommended Video
అడవి శేష్, రెజీనా ప్రధాన పాత్రల్లో వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎవరు'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తొలి షో నుంచే పాజిటివ్ మౌత్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అడవి శేష్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి... పాషన్తో 'క్షణం' అనే సినిమాను టీమ్ వర్క్గా చేసి చిన్న సినిమాను పెద్ద సక్సెస్ చేసి తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. దాని తర్వాత గుఢచారి, ఇపుడు ఎవరు సినిమాతో మంచి విజయం అందుకున్నాడు అంటూ ప్రశంసలు గుప్పించారు.
మాకు బ్యాగ్రౌండ్ లేదు అనొద్దు
చాలా మంది సర్.. మాకు బ్యాగ్రౌండ్ లేదు, మమ్మల్ని ఎవరు చూస్తారు అంటూ ఉంటారు. అలా అనే వారికి శేషు ఒక మంచి ఉదాహరణ. మన వద్ద టాలెంట్ ఉంటే కష్టపడితే ఏదైనా సాధించవచ్చని ఈ జనరేషన్కు రుజువు చేశాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ రాణిస్తున్నాడని చెప్పారు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు
ఈ సినిమా రిలీజ్ ముందు రోజు ప్రసాద్ ఐమాక్స్లో చూశాను. పాటలు లేకుండా, ఫైట్స్ లేకుండా డైరెక్టర్ వెంకట్ రాంజీ అండ్ టీమ్ ఇంత ఇంట్రెస్టుగా ఆడియన్స్ను సీట్లో కూర్చోబెట్టడం చాలా గొప్ప విషయం. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు వచ్చాయి.
డైరెక్టర్ రెజీనాను బాగా పిండేశాడు
పెర్ఫార్మెన్స్ సైడ్ రెజీనాను డైరెక్టర్ బాగా పిండేశాడు. ప్రతీ సీన్, ప్రతి షాట్లోనూ తనకు కావాల్సిన ఎక్స్ ప్రెషన్స్ రాబట్టుకున్నాడు. చాలా సేపటి వరకు ఆమె పాత్ర నెగెటివా? పాజిటివా? అనేది అర్థం కాదు... అంత బాగా స్క్రీన్ ప్లే ఉందని దిల్ రాజు వ్యాఖ్యానించారు.
నాకు ఇలాంటి కథలు జడ్జ్ చేయడం రాదు
పివిపి గారు నా ఫ్రెండ్, ఆయన బేనర్లో మరొక మంచి సినిమా వచ్చింది. దీన్ని మేము నైజాంలో రిలీజ్ చేసినందుకు హ్యాపీగా ఉంది. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. నిన్న మార్నింగ్ శేషుతో మాట్లాడుతూ ఏం చేస్తున్నావంటే రెండు సినిమాలు చేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ఏమైనా ఉంటే మా బేనర్లో ఇలాంటి సినిమా చేయ్ అని చెప్పాను. ఇలాంటి సినిమాలకు నేను జడ్జిమెంట్ చేయలేను, ఒక స్టోరీ ఏముంది? ఎలా ఉంది అంటే చెప్పగలను కానీ ఇలాంటి ట్విస్టులు ఉంటే నాకు సరిగా జడ్జ్ చేయడం రాదు. వీటిలో శేషుకు బాగా అనుభవం ఉంది. అందుకే క్షణం, గూఢచారి, ఎవరు సూపర్ హిట్ అయ్యాయి అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
ఎవరు
ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా ఈ చిత్రాన్ని నిర్మించింది. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించారు. దర్శకత్వం: వెంకట్ రామ్జీ, నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, డైలాగ్స్: అబ్బూరి రవి, కాస్ట్యూమ్స్: జాహ్నవి ఎల్లోర్, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్: యతిరాజ్.